జేష్ఠ బహుళ ఏకాదశి వ్రతం చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ?



సంవత్సరం లో 12 నెలలు , ప్రతి నెల 2 పక్షాలు. ప్రతి పక్షానికి 2 ఎకదసులు అంటే 24 ఎకదసులు వస్తయి. ఒక వేల అధిక మాసం వస్తే అ సంవత్సరం వస్తే అ సంవత్సరం 26 ఏకాదశి వస్తాయి. ఎవరయినా ఏకాదశి వ్రతం చేస్తే వారిని అడ్డగించిన వారికీ పాపం వస్తుంది. ఏకాదశి వ్రతం చేసే వారికీ సుదర్శన చక్రం కావాలి కాస్తుంది, రక్షణ చేస్తుంది. 

శ్రవణ మాసం - పుత్రద ఏకాదశి 
భాద్రపద మాసం - పితృదేవతల ఏకాదశి 
కర్తీక మాసం , ఆస్విజ ఏకాదశి , ఇలా అనేక రకాల ఎకదసులు ఉన్నాయి. 

జేష్ఠ బహుళ ఏకాదశి వ్రతం - యోగిన్యై ఏకాదశి అని పేరు కూడా ఉంది. 
కధ - 
కుబేరుడు నిత్య శివ పూజ చేసేవాడు. తెల్లవారుజామున తోటమాలి అ తోట లో ఉన్న పువ్వులు అనీ గుచ్చీ తీసుకొచ్చి ప్రాతః కాలంలో అందించేవాడు. దేవతలు చేసే పూజ బ్రాహ్మి ముహూర్తం లో పూజ చేస్సేవాడు. ఒక రోజు అ తోటమాలి బార్య లోలుడయి, పూజ కి పువ్వులు  ఇవ్వలేదు. కుబేరుడు పువ్వులు ఎందుకు ఇవ్వలేదుఅని విచారణ చేయగా విషయం తెలిసింది. కోపం తో శివ పూజకి పువ్వులు ఇవ్వకుండా బార్య లోలుడవై ఉన్నావు కాబట్టి కుష్టి వ్యాది వస్తుంది అని సేపించాడు. దానితో కొంత కాలం అ తోట మాలి కుష్టు వ్యాది తో బాద పడి కొంత కాలానికి శాప విమోచనం అడిగాడు. అప్పుడు కుబేరుడు జేష్ఠ బహుళ ఏకాదశి వ్రతం చేయమన్నాడు. అల చేయటం వలన శాప విమోచనం జరుగుతుంది అని చెప్తాడు. తరువాత అ తోట మాలి తన బార్య తో కలిసి శాస్త్రోక్తం గా ఏకాదశి వ్రతం ఒక సంవత్సర కాలం చేస్తాడు. దానివలన శాప విమోచనం జరుగుతుంది. శాప విమోచనం జరిగిన తరువాత తిరిగి మల్లి కుబేరుడి పూజ కి పువ్వులు అందిస్తాడు. 

ఒక వేల ఎవరయినా పెద్దలతో, గురువులతో తిట్లు తిని ఉంటే లేదా బ్రాహ్మి ముహూర్తం లో సంసార సుకం పొంది ఉంటే , ఎప్పుడయినా శివ పూజ ని నిర్లక్ష్యం చేసి ఉంటె , ఎవరయినా కుష్టు వ్యాధి తో కాని లేదా ఏదయినా ఒక వ్యాది తో పాదపడుతుంటే వారు అందరు కూడా ఈ ఏకాదశి వ్రాతని ఒక సంవత్సర కాలం చేయటం వలన శాప విమోచనం జరిగి , రోగ నివారణ జరుగుతుంది (లేదా ఒక డాక్టర్ ని కలిసే అవకాసం కలుగుతుంది ).