ఏకాదశి వ్రతం పాటించనివారు / చేయని వారు ఏ నియమాలు పాటించాలి?


పై మంత్రం చదువుకుంటే నిగ్రహ శక్తి పెరిగి అ శ్రిమనారాయణ మీద మనసు నిలబడుతుంది. 

ఏకాదశి వ్రతం చేయాలి అనుకునే వారు పాటించవలిసిన నియమాలు - 

ఏకాదశి వ్రతం చేయాలనుకునే వారు ముందు రోజు (దసిమి) తలస్నానం చేసి నిత్యార్చన అయిన తరువాత విష్ణుమూర్తి ని స్మరిస్తూ " ఎ ఏకాదశి ని ప్రారంబిస్తునారో - దేనికోసం చేస్తునారో (కోరికని చెప్పుకుని ) " అనుగ్రహించమని కోరి నమస్కరించుకోవాలి. ఏకాదశి వ్రతం చేయాలి అనుకునేవారికి దశిమి రోజు నుంచే నియమాలు పాటించాలి. దశిమి రోజున అన్య పదార్దాలు తినకూడదు, మద్యానం మాత్రమే భోజనం చేయాలి, సాయంత్రం భోజనం చేయకూడదు, మంసహరాలు , మద్యం నిషేధం , బ్రహ్మచర్యం పాటించాలి.

ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.

ఇక ఏకాదశి రోజు నది దగ్గరగా ఉంటె తెల్లవారుజామున నది స్నానం చేయటం లేదా ఇంట్లో స్నానం చేయటం, నిత్య ఆర్చన చేయటం. సాయంత్రం మల్లి నిత్య అర్చన చేయటం కుదిరితే సత్యనారయణ పూజ చేయటం , ప్రసాదం మాత్రం తినకండి కళ్ళకి అద్దుకుని పక్కన పెట్టి ద్వాదశి రోజున తినాలి. ఏకాదశి రోజున రామ / నారాయణ నామ స్మరణ చేయటం రామాయణం లేదా భాగవతం లేదా విష్ణు పురాణం కానీ పారాయణం చేసుకోవాలి.


సామూహికంగా జాగరణ చేయటం , మరునాడు తెల్లవారుజామున పూజ చేసుకుని లక్ష్మి నారాయనులకు తులసి దళాతో అర్చన చేయటం. పండితులకి స్వయం పాకం ఇవ్వటం/ అన్న సత్రాలలో అన్న దానం ఏర్పాటు చేసి , క్షీరన్నమ్ నివేదన్ చేసి . ద్వాదశి గడియలు పోకుండా పారణ చేయలి. ద్వాదశి రోజున కూడా నియమాలు పాటించాలి , అన్య పడద్ర్దాలు తినకూడదు , రామ నమ జపం చేసుకుంటూ ఉండాలి, పారాయణ చేసుకోవాలి. కృష్ణ పక్షం , బహుళ పక్షం లో వచే రెండు ఏకాదసులు పాటించాలి ఒక సంవత్సర కాలం. అప్పుడు విష్ణు మూర్తి క్రుపకి పాత్రులు అవుతారు.   

సర్వ జనులూ పాటించాల్సిన నియమాలు ఏమిటి -
 ఏకాదశి వ్రతం చేయని వారు బ్రహ్మచర్యం పాటించాలి, మద్య మాంసాలు ముట్ట కూడదు. ఏకాదశి రోజున ఎవరు కోరికలకి లోనవుతారో వారు అంత దరిద్రులవుతారు, అది మహా దోషం కింద చెపుతారు. అ ఫలితంగా పుట్టే పిల్లలు కూడా దరిద్రులు అవుతారంట.


పెళ్లి అయిన తరువాత 16 రోజుల లోపు ఏర్పాటు చేసే వేడుక , ఒక వేల ఆ 16 రోజులలో ఏకాదశి ఉంటె చేయకూడదు. అది మహా దోషం. ఎలాంటి వారు అయిన ఈ నియమాలు పాటించాలి. బ్రహ్మచర్యం కటినంగా అందరూ / సర్వ జనులు పాటించాలి.