గోవు...!..ఇందా.. !...గోవిందా !

కలౌ వేంకట నాయక:"అన్నట్లు కలి యుగానికి ఆరాధ్య దైవం వేంకటేశ్వర స్వామి .నాలుగు లక్షల ముప్పై రెండు వేల ,సంవత్సరాల ప్రమాణం కల ,కలి యుగానికి అధి దైవం ,శ్రీ వేంకటేశ్వర స్వామి ఈ యుగాది నందే , తానుండవలసిన చోటు "సప్తగిరి "అని ఎంచుకొని ,తిరుపతి ప్రాంతానికి వచ్చాడట !అప్పుడు అక్కడ చిర కాలంగా ,ఆశ్రమం ఏర్పరచుకొని ,తపస్సు చేసుకుంటూ ఉన్న,అగస్త్య మహర్షిని ,చూచి ,"ముని పుంగవా!నేను వేంకట నాయకుణ్ణి .ఈ కలి యుగానికి అధిపతిని .అందరికీ ఆరాధ్య దైవాన్ని.ఈ "సప్తగిరి "మీద నివసిద్దామని ,వచ్చాను .రోజూ క్షీర సేవనం చెయ్యడానికి , నాకు ఒక గోవునిస్తావా ?"అని అడిగాడు .ఋషి ఆ మాటలు విని పులకించి పోయాడు ."ఓహో !ఏమి నా భాగ్యం ?సాక్షాత్తూ ,వేకటేశ్వర స్వామియే ! వచ్చి,నన్ను!గోవునిమ్మని ,అడగ వచ్చాడా ?"అని ఆనందిస్తూ . అప్పుడాశ్రమంలో ఉన్నగోవులు మేతకై ,అడవిలోకి వెళ్ళడం చేత ,అగస్త్యుడు చేతులు మోడ్చి ,"స్వామీ !అలాగే ! నీకు గోవును తప్పకుండా ఇస్తాను.నీవు నివసించే !స్థలం " ఫలానా "అని ఎంచుకున్నావే !కానీ,ఇంకా రాలేదు కదా! మా అమ్మతో,కూడా కలసి వచ్చిన నాడే,నీకిస్తాను" అని , అన్నాడు . అందుకు ఆనందించిన  స్వామి ,అలాగే !లెమ్మని ,అంతర్హితుడయ్యాడు .మరి కొన్నాళ్ళకి , లోక మాత అయిన లక్ష్మీదేవి తో , కూడి ,ఇక యుగాంత పర్యంతం ,స్థిర నివాసం ఏర్పరచుకోటానికి ,వచ్చినప్పుడు , మళ్ళీ అగస్త్యాశ్రమానికి ,వచ్చాడు .అప్పుడు అగస్త్యఋషి అక్కడ లేడు .శిష్యుడెవరో ఉంటే ! స్వామి ఈమాటే !అతనితో ,చెప్పాడు.అతను "అలాగే ! స్వామీ !మా గురువుగారెక్కడికో వెళ్ళారు.రాగానే , చెబుతానన్నాడు.స్వామి వెనుదిరిగాడో లేడో !అగస్త్య మహర్షి, ఆశ్రమానికి వచ్చాడు.వెంటనే శిష్యుడు గోవు విషయం చెప్పి "అడుగో !స్వామి !" అని అటుగా చూపించాడు "అలాగా !దేవ దేవుడు నా ఆశ్రమానికి వచ్చిన సమయానికి నేను లేకపోవడం ఎంత దురదృష్టం ! "అని ఏంతో  మదిలో నొచ్చుకుంటూ ,పాకలో ఉన్న గోవు నొకదానిని ,కట్టు విప్పి , గబగబా ,వేకటేశ్వరుని వెంటబడి ,"గోవు+ఇందా !" అని కేకలు వేసుకుంటూ ,వెనకాలే వెళ్ళాడు .'ఇందా 'అంటే "ఇదిగో !తీసుకో ! "అని అర్ధం .కాబట్టి మునీంద్రుడు ,ఎలుగెత్తి ," గోవిందా !గోవిందా !" అని అరుస్తూ , వెంటబడి వెళుతూనే ఉన్నాడు . శిఖరాగ్రానికి చేరే సరికి , నూటెనిమిది సార్లు ముని ,"గోవిందా !గోవిందా ! " అని కేకలు వేశాడు .అప్పుడు స్వామి వెనుదిరిగి ,"మునీంద్రా !గో...విదిగో ! తీసుకో ! అనే అర్ధంలోనే ,అయినా నన్ను నీవు "గోవిందా !గోవిందా! "అని నూటెనిమిది సార్లు నన్నుద్దేసించి అన్నావు కాబట్టి, గోవిందుడనేది,నా నామాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది "నాకీ గోవిందనామం ఎంతో ! ప్రీతి పాత్రమయ్యింది ! కూడా !నీలాగే ఈ కొండనెక్కే నా భక్తులు , నన్నుద్దేశించి ,"గోవిందా !గోవిందా! "అని నూటెనిమిది సార్లు ,పలికితే !వాళ్ళకి !మోక్షమిస్తాను " అని వాగ్దానం చేసి , అగస్త్యుడిచ్చిన గోవును ఆప్యాయంగా !స్వీకరించాడు.

కనుకనే ,ఏడుకొండల స్వామిని దర్సించే భక్తులు "ఏడు కొండల వాడా ! వెంకట రమణా !గోవిందా !గోవిందా !ఆడుగు దండాల వాడా !గోవిందా ! గోవిందా ! ఆపద మ్రొక్కుల వాడా !గోవిందా !గోవిందా !అని నోరారా పిల్చుకుంటూ ,స్వామి సేవ చేసుకుంటూ ఉంటారు భక్తులు .గోవింద నామ స్మరణం చేస్తేనే !ఆ స్వామికి !ప్రీతి కదా ! సహస్ర నామాలున్నా!ఆ వేంకటేశ్వర స్వామిని ఇలా....! "గోవిందా !గోవిందా !"అనే గోవింద నామార్చనతో పిలుస్తూ నేటికీ భక్తులు తరిస్తున్నారు కదా !!!