భారతీయ గ్రంధాలు


 చారిత్రిక భారతదేశం లో విద్య లో భాగంగా ఏడు అంశాలు ఉండేవి.
1.వేదం
2.స్మృతి
3.దర్శన శాస్త్రం 
4.పురాణాలూ 
5.శంకరాచార్య ప్రవచనాలు.
6.ఇతిహాసాలు,
7.భగవద్గీత.

1.వేదం వేదాలు నాలుగు.మొదట అన్ని వేదాలు కలిసి ఇకే వేదంగ ఉండేవి.ద్వాపర యుగం లో వేద విభజన వ్యాసుడి ద్వార జరిగింది.తద్వారా చతుర్వేదలుగా విభజించబడ్డాయి. 

ప్రతీ వేదంలో నాలుగు భాగాలుంటాయి.
మంత్రసంహిత,
బ్రాహ్మణము,
ఆరణ్యకము మరియు 
ఉపనిషతులు.

1).సంహితం:- "సంహితం భవతి హ్యక్షరిణి ధనం ప్రతిష్ఠాయై" - అనగా తరగని సంపదను కలిగించునది సంహితము. "సంధి" అనే అర్ధంలో కూడా సంహితను వివరిస్తారు.  వేదమునందలి శాస్త్రమును సంధించునది సంహితము. 

(సంహితమ్ = కూడుకొనునది) వేద సంహిత అంటే మంత్రాల, సూక్తాల కూర్పు మాత్రమే  రచన కాదు.  అంటే వేద ద్రష్టలైన ఋషులు వీటిని రచించలేదు (వేదాలు "అపౌరుషేయాలు"). వీటిని దర్శించి, స్మరించి, కూర్చారు.

"సంహిత" అంటే మంత్రాల సంకలనం. నాలుగు వేదాలకు నాలుగు సంహితలున్నాయి. అసలు వేదం అంటే సంహితా విభాగమే. అంటే మంత్రాల సముదాయం. 
ఋక్సంహితలోని మంత్రాలను ఋక్కులు అంటారు.
యజుర్వేదంలో యజుస్సులు
సామవేదంలో సామాలు
అధర్వవేదంలో అంగిరస్లు అనబడే మంత్రాలుంటాయి. 

యజ్ఞంలో నలుగురు ప్రధాన ఋత్విజులు ఉంటారు.
ఋగ్వేద మంత్రాలను పఠించే ఋషిని "హోత" అని,
 యజుర్మంత్రాలు పఠించే ఋషిని "అధ్వర్యుడు" అని,
 సామగానం చేసే ఋషిని "ఉద్గాత" అని,
 అధర్వాంగిరస్సులను పఠించే ఋషిని "బ్రహ్మ" అని అంటారు. ఈ నలుగురూ యజ్ఞ వేదికకు నాలుగు వైపుల ఉంటారు.

2).బ్రాహ్మణాలు:- సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.వీటిని ముందు ముందు వివరించటం జరుగుతుంది.

3).అరణ్యకాలు:- ఆరణ్యకం అనగా అడవులకి సంబంధినది అనిఅర్ధం. ఇది వేదాలలో ఒక భాగం. ఇతిహాస కాలంలో మునుల తత్త్వ విచారణ.యాగ ద్రవ్య పదార్ధ సేకరణ కోసం ఆరణ్యక భాగం ఉపయోగపడుతుంది.

4).ఉపనిషతులు:- వేదముల చివరిభాగములే ఉపనిషత్తులు ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. 

నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. 
వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడ అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. 
వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక శంకరాచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదాహరించారు.

తరువాతి అంశం వేదాంగాలు మరియు ఉపవేదాలు.