పోతనామాత్యుని ...భాగవత పద్యాలు




పలికెడిది భాగవతమట , పలికించు విభుండు రామభద్రుండట ! నే
పలికిన భవహరమౌనట ! పలికెద వేరొండు గాథ పలుకగనేలా ?

“పలికేది భాగవతం , పలికించేవాడు రామచంద్రుడు . అది నేను పలికితే ముక్తి లభిస్తుందట . నేను నాది అన్న భావం మటు మాయమవుతుందట . వేరేగాధలను పలకడమెందుకు . భాగవతాన్నే పలుకుతాను ” అని అన్నాడు పోతన్న . అదే పలికాడు , మనభాగ్యం కొద్దీ .

” భాగవతం తెలిసి పలుకడం శూలికీ , తమ్మిచూలికీ కూడా అసాధ్యమని తెలిసినా ” 
తను పలికాడు . చేసే ప్రతి పనినీ పరమాత్మ పూజగా భావించాలి . పూజలో లోపాలు రానీయం కదా . తలపెట్టిన పని దిగ్విజయంగా ముగుస్తుంది . ఫలితాన్ని మాత్రం ఆతనికే వదిలి వేయాలి . ఇలా చేసినందు వల్ల ఏకారణంవల్లనైనా చేసిన పనికి ఫలితం లభించకున్నా బాధ కలుగదు . ఫలితం లభించక పోవడమన్నది నూటికో కోటికో ఒక సారి కలుగుతుంది .