ఆస్విజ శుక్ల ఏకాదశి విశేషం ఏమిటి?

ఆస్విజ శుక్ల ఏకాదశి ని పాసాంకుస ఏకాదశి అంటారు అంటే పాశం అంకుశం అంటారు . అంటే యమ పాశం నుంచి ఈ రోజు ఏకాదశి వ్రతం చేయటం వలన మనని కాపాడుతుంది ఇది అంకుశం లాంటిది. ఈ కాలం లో అనేక రోగాలతో బాదపడుతూ ఉంటారు. ఈ నెలలో అనేక రోగాలు ప్రభాలే అవకాసం ఉంది. 

ఒక ఋతువు నుంచి ఇంకో ఋతువు కి వెళ్ళే కాలం అ సంధి కాలం లో అనేక రోగాలు ప్రబలే అవకాసం ఉంది. యమ పాశం నుంచి రక్షణ కావలి అనుకునే వారు అంతా పూజ చేయాలి. నిరాహారం గ ఉంది నారాయణ మూర్తి ని స్మరించాలి , సేవించాలి.

ఈ మాసం లో పొద్దున్న అంతా ఉపవసించి సాయంత్రం పూట తులసి దగ్గర లక్ష్మి నారాయణల కి పూజ చేయాలి అంటారు. ఈ విదంగా కర్తీక మాసం లో కదా చేయాలి , ఇప్పుడు ఏంటి అంటే ఈ వ్రాతని చేసే వారు ఈ ఏకాదశి నుంచే ప్రారంబించాలి అంటారు. ఈ తులసి కి అలికి 5 రకాలా పద్మాలు 5 ముగ్గులు, 5 రకాల వంటలు నైవేద్యం పెట్టాలి. తులసి కి నారాయనుకి దీపం పెటాలి. రాత్రి అంతా నారాయణ మూర్తి బజన చేయాలి. నారాయణనుని అనుగ్రహం పొందాలి. మరుసటి రోజు ద్వాదశి ఘడియలలో పారణ చేయాలి.

ఆస్విజ శుక్ల ఏకాదశి, ఆస్విజ బహుళ ఏకాదశి, కార్తిక సుద్ద ఏకాదశి ఈ 3 ఏకాదశి లో ఈ వ్రతం నియమాలు ఇలాగే చేయాలి అని ప్రత్యేకం గ కనిపిస్తుంది.

దీపావలి తెలవారి నుంచి కార్తిక మాసం ప్రారంభం కాబట్టి నది స్నానం చేయాలి అనుకుంటూ ఉంటారు , కానీ శాస్త్రం ఎం చెపుతుంది , ధర్మ సింధు ఎం చెపుతుంది: కార్తీక స్నానం అని పేరు ఉన్న దీన్ని ఆస్విజ శుక్ల దశమి(విజయ దశమి ) కానీ , ఏకాదశి కానీ లేదా ఆస్విజ సుద్ద పౌర్ణిమ రోజు కానీ ప్రారంబించాలి అని చెపుతునారు.

కార్తీక స్నానం ప్రత్యేకం ఏమిటి ?

సూర్యోదయం ముందు గా 2 ఘడియల ముందు గా అంటే 48 నిముషాలు ముందు గా , నది లో
స్నానం చేయాలి . నాభి మునుగే వరకు మునిగి స్నానం చేయాలి. ఇంట్లో స్నానం చేసి పూజ చేసుకుని అప్పుడు నది లో స్నానం చేయటానికి వెళ్ళాలి. నదికి స్నానం చేయకుండా వెళ్ళకూడదు. అక్కడ స్నానం చేసి సూర్యుడికి , అమ్మవారికి , గణపతి , నారాయణకి నమస్కరించి అర్ఘ్యప్రదానం చేయటం , తెలిసి తెలియక చేసిన పాపలు పోవాలి అని నమస్కరించుకోవాలి. నది తీరాన లేని వాలు ఇంట్లో అయిన నక్షత్రం ఉండగా స్నానం చేసి దీపం పెటాలి. తులసి దగ్గర కూడా దీపం పెట్టాలి.

నియమాలు కూడా చాలా ఉనాయి, చాతుర్మాస దీక్షలొ ఎలా నియమాలు పటిస్తమో అలాగే ఇక్కడ కూడా బుసయనం చేయటం , ఏక బుక్తం , బ్రహ్మచర్యం చేయటం , దేవత ఆరాధనా , మొతం దీక్షలొ నక్తం ఉండడం (పగలు అంతా ఉపవసించి , సాయంత్రం ప్రదోష కాలం లో శివారాదన చేసి భోజనం చేస్తారు ). నారాయణ మూర్తి కి సత్యనారాయణ వ్రతం చేసుకోవటం , లేదా శివరాదన విశేషం గ చేసుకోవాలి.