108 ప్రత్యేకత

'ఏకం సత్ విప్రా బహుధా
వదంతి'
'సత్యం
ఒక్కటే' దానిని జ్ఞానులు బహువిధాలుగా
చెపుతారు. ఆవిష్కరణ సృష్టి భగవంతునిలోనే
ఉంది. స్వర్గం,
పాలపుంత, గ్రహాలూ, నక్షత్రాలు, మానవులు,
ఇతర జీవకాలమూ ఆభగవంతునిచే సృష్టించబడింది.
ఈ విశ్వంలో ఒక
లయ, ఒక కూర్పు, ఒక
సమన్వయం ఉంది. ఈ విషయం
ప్రాచీన భారతీయులకు బాగా తెలుసు. సంభ్రమమైన
108 సంఖ్య ప్రాచీన భారతీయులకు చాల
పవిత్రమైనది. అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో
108 సంఖ్యకు వారు చాలా ప్రాముఖ్యతనిచ్చారు.
దేవునికి/దేవతలకి మంత్ర పుష్పాలతో
పూజిస్తూ 108 పవిత్ర తులసి/రుద్రాక్షలు
గల పవిత్ర జపమాలలను
గణిస్తూ జపం చేసేవారు. 108 సంఖ్య
యొక్క ప్రాముఖ్యతను భారతదేశంలో గల హిందువులే కాదు,
భౌద్ధులు, జైనులు, సిక్కులు, (ప్రస్తుతం
క్రిష్టియన్స్ కూడా ప్లాస్టిక్, రేడియం
జపమాలలు మొదలెట్టారు) వంటి వారు కూడా
గుర్తించారు. తనలోని దైవత్వం గ్రహించడానికి
ఆత్మ 108 మెట్లు దాటాలని పూర్వీకుల
నమ్మకం.
వేద ఋషులు ఖగోళ శాస్త్రానికి
సంభందించిన గణనలో
భూమికి,
చంద్రునికి, మధ్య దూరం, చంద్రుని
వ్యాసానికి 108 రెట్లు ఉందని,
భూమికి సూర్యునికి మధ్య దూరం, సూర్యుని
వ్యాసానికి 108 రెట్లు ఉందని,
సూర్యుని
యొక్క వ్యాసం భూమి వ్యాసానికి
108 రెట్లని నిర్ధారించారు.
ఈ వేద గణనలో ఆధునిక
సాంకేతిక విశ్వ గణనలో లభించిన
భూమికీ - చంద్రునికీ, భూమికీ - సూర్యునికీ ఉన్న
దూరంతో దాదాపు సరిపోయింది.
ఆయుర్వేదం
మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలు గుర్తించింది.
108 మర్మ స్థానాల గొలుసులో 107 గ్రంధులు
శరీరంలో ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది. అలాగే పవిత్రమైన శ్రీ చక్రంలో 57స్త్రీ,
54పురుష అంతర్భాగాలు ఉంటాయి. ఇవి మొత్తం
108. మనవ ప్రవృత్తికి సంభందించి బ్రహ్మాండాన్ని 27 చంద్ర సూచికలైన నక్షత్రాలతో,
ఒక్కో నక్షత్రం తిరిగి 4పాదాలతో
ఉంటుందని గుర్తించింది. ఇవి మొత్తం 108 పాదాలయింది.
అవే 108 ప్రాదమిక మనవ ప్రవృత్తులు.
శిశు జనన సమయంలో చంద్రుడు
ఏ పాదంలో ఉంటాడో,
దాని ప్రభావం ఆ వ్యక్తి
జీవితంలో, వృత్తిలో, ఆనందంలో, కుటుంబంలో, చివరకు
మోక్షమార్గంలో కూడా ప్రతిఫలిస్తుంది. బారతీయ
జ్యోతిష్యంలో 12రాశులు, 9గ్రహాలు ఉంటాయి.
12ని 9తో హెచ్చవేస్తే 108.
మానవుడు
సగటున ప్రతిరోజూ 21,600సార్లు శ్వాస తీస్తాడు.
అందు 10,800 సూర్యాంశ, 10,800చంద్రాంశ, 108ని 100తో గుణిస్తే
10,800 వస్తుంది. దీనిని 2తో గుణిస్తే
21,600 వస్తుందని తంత్ర శాస్త్రం చేపుతుంది.
సంఖ్య శాస్త్రం ప్రకారం 108లో
18కి యజ అనే పేరు.
దేనిని తిరగవేస్తే ''జయ'' అని వస్తుంది.
ఈపేరుతోనే మహాభారతం లిఖించబడింది. కాలక్రమంలో
''జయ'' అనే ఇతిహసాన్ని పెంచడం
వలన ''మహాభారతం'' అనే పేరుతొ ప్రసిద్ది
చెందింది.
మన పురాణములు 18, ఉపనిషత్తులు 108, భగవద్గీతలో 18 అధ్యాయాలు 18, ఇంకా ఎన్నో గ్రంధాలలో
108 శ్లోకాలు ఉంటాయి. విష్ణు సహస్రనామాలు
108, నిత్యమూ మనం పూజించే విధానంలో
అష్టోత్తర శతనామాలు ఉంటాయి. భారతీయ
కాలగణన ప్రకారం 4యుగాలలో 43,20,000 సంవత్సరాలు
ఇది 108సంఖ్యతో భాగించబడింది.
ఇంతటి వైశిష్ట్యం గల 108సంఖ్య ఎంతో
దివ్యమైనది. ఇది సృష్టికర్తకు, సృష్టి
అనుసంధానం కలిగించేది. అందుకే ఋషులు, పురాణములు,
వేదములు, భారతీయ సంస్కృతి 108సంఖ్యకు
పవిత్రత ఇస్తున్నది.