వైదికమా? వ్యాపారమా ?

ప్రస్తుతకాలంలో, వైదిక వృత్తిని కేవలం బ్రాహ్మణులే కాక, అన్ని వర్ణములవారు ఆచరించవచ్చుననే వాదన వినిపిస్తోంది. ఇది ఆమోదయోగ్యమేనా వైదిక వృత్తిని ఆచరించే వారందరూ బ్రాహ్మణులేనా? ..... అవును.
ప్రస్తుతం, ఈ కొత్తదైన వింత వాదన అన్నిచోట్ల వినిపిస్తూ వున్నది. నాస్తికలోకం, ఈ విషయాన్ని చాలా తెలివిగా ప్రచారం చేస్తున్నామని అనుకుంటోంది. నిష్పాక్షికంగా, నిర్ద్వందంగా వుంటే మనమదరం కూడా ఈ వాదనను సమర్ధించవలసిందే. కానీవాదనలో ఎంతవరకు స్పష్టత వున్నదనేది కూడా ఆలోచించాలి. ఎవరో నాస్తికులు వేసిన విషపు బీజం, నిదానంగా ఈ హిందూ ధర్మవ్యవస్థ మొత్తం పాకిపోతోంది. ఆ విషవృక్షం, ఆధ్యాత్మిక వ్యవస్థ మొత్తాన్ని సమూలంగా కప్పివేసేలోపు నిర్ణయం తీసుకోలేకపోతేమన  హిందూధర్మం చరిత్రగా  మిగిలిపోవలసినదే తప్ప, చేయగలిగేది ఏమి లేదు.

బ్రాహ్మణత్వము జన్ముమును బట్టి కాక, వారు చేసే వృత్తిని బట్టి వస్తుందనేది కొత్త వాదన. అందుకని, వైదికవృత్తిని అందరూ ఆచరించవచ్చుననీఅదే విధంగా వైదికవృత్తిని ఆచరిస్తున్నవారందరూ బ్రాహ్మణులె అని అంటున్నారు. కానీ, వైదికము అంటే ఉద్యోగమో, వ్యాపారమో కాదు. నిస్వార్ధంగా, నిష్కల్మషంగా చేయవలసిన దేవతా క్రతులకు సంబంధించినది.  అలాగ కాదు. ఇది కూడా ఒక కులవృత్తే కనుక, వైదిక వృత్తిని ఆశ్రయించి బ్రతుకుతున్న వారందరూ బ్రాహ్మణులే అని అంటే.   .... అవును. తప్పకుండా అంగీకరిద్దాం.

వైదికవృత్తిని ఆచరిస్తున్న బ్రాహ్మణేతరులందరినీ  కూడా బ్రాహ్మణులనే అంగీకరిద్దాం. కానీ, అంతకంటే ముందు ఈ నాస్తిక సమాజం చేయవలసిన పని మరొకటి వున్నది. ఇతర వ్యాపార, ఉద్యోగములు చేసేవారందరినీ కూడా, వారు వున్న విభాగాన్ని బట్టి ఆయా కులములకు చెందిన వాళ్ళేనని అంగీకరించండి. ఆ తర్వాత సక్రమంగా వున్న వైదిక వ్యవస్థను ఎలా నాశనం చేయాలో ఆలోచించండి. అంటే....... ,

వెండి, బంగారం నగల వ్యాపారం చేసే వారందరినీ కంసాలులని
బట్టల వ్యాపారం చేసే వారందరినీ సాలీలని,
మట్టి వస్తువుల వ్యాపారం చేసే వారందరినీ కుమ్మరివారనీ,
బ్యూటీపార్లర్, సెలూన్ షాపులు నడిపెవారందరినీ మంగలివారనీ,
హస్తకళల వస్తువుల వ్యాపారం చేసేవారందరినీ మేదరవారనీ,
చెప్పుల దుకాణాలు నడిపే వారందరినీ కమ్మరి అని,
కిరాణా, ఫాన్సీ దుకాణాలు నడిపేవారందరినీ వైశ్యులని,
మిగతా వృత్తుల వారందరినీ, వారు చేస్తున్న వృత్తులను బట్టి ఆయా కులములకు చెందినవారిగా అంగీకరించండి.
ఇప్పటికే అనేక వృత్తులవారు, నాస్తికభావాల ప్రభావంతో ఆత్మన్యూనత భావనను పెంచుకొనివంశానుచరితంగా వస్తున్న వృత్తులను వదిలివేస్తూ, ఆదాయం కోసం వేరే వృత్తులను ఎంచుకోవటం జరుగుతోంది తద్వారా ఈ కులవృత్తులు అన్నీ అస్తవ్యస్తం కావటం చూస్తూనే వున్నాం. 

నిన్నటివరకు, మరే దేశంలో లేని విధంగా అత్యంత అందమైన కులవృత్తి విధానం మన దేశంలో వుండేది.
ఎవరి వృత్తులను వారు చేసుకుంటూ పక్కవారిని ఇబ్బంది పెట్టకుండా జీవించేవారు. కానీ నేటిరోజున ఆ పరిస్థితి లేదు. నాస్తిక భావాల ప్రభావంతో, ఎన్నో అందమైన కులవృత్తులను కోల్పోతున్నాము.  అందరి ఆలోచన, "పొరుగుంటి పుల్లకూర రుచి" అన్న సామెతలాగా మారిపోయింది.  తాము చేస్తున్న వృత్తిని అభివృద్ది చేసుకోవాలనే ఆసక్తి తగ్గిపోయిపక్కవారు తమ వృత్తులలో తేలికగా అధిక లాభాన్ని పొందుతున్నారేమో అన్న ఆలోచనతో ఆయా వృత్తులలోకి మారిపోవటం జరుగుతోంది. ప్రస్తుతం, ఏ వృత్తి విధానాలలోనూ నైతిక విలువలు లేవని మనమే అంటున్నాం. మళ్ళీ ఇంకో కొత్త సమస్యకు ఆజ్యం పోస్తున్నాం. కొంతవరకు సరియగు దారిలో వున్న వైదిక వ్యవస్థను నిర్వీర్యం చేయటం ఒక సంస్కారహీనమైన చర్య. బ్రాహ్మణేతరులని వైదికులుగా ప్రోత్సహించటం వలన, వైదికమనే ఓ కొత్త వ్యాపారం సమాజంలోకి వస్తుంది. ఇప్పటికే, కొంతవరకు ఆ వ్యాపార లక్షణాలను చూస్తున్నాం. ...... అవును. 

ఇటువంటి నాస్తిక చర్యలను ప్రోత్సహించేవారందరూ నాస్తికులే. ఈ విధమైన ప్రయోగాల వలన ఆధ్యాత్మిక వ్యవస్థ తద్వారా ధార్మిక సమాజం అస్తవ్యస్తం కావటం తప్ప, లభించే ప్రయోజనం ఏమి లేదు. భక్తులందరూ, ఈ నాస్తిక చర్యలను నిర్ద్వందంగా ఖండిస్తారని ఆశిద్దాం. 

చివరగా ఒక్కమాట : నేటి సమాజంలో, చాలామంది ఆధునిక భావాలతో ఉన్నామని అనుకుంటున్నారు. కానీ, నాస్తిక భావాలలో చిక్కుకొని అనాలోచితంగా మారిపోతున్నామని తెలుసుకోలేకపోతున్నారు. ఆ సత్యాన్ని గ్రహించేసరికి హిందూధర్మము యొక్క పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం వున్నది. ఇది ఆలోచించే సమయం కాదు. స్థిరమైన నిర్ణయం తీసుకునే సమయం.  వైదికము అత్యంత పవిత్రమైన వృత్తి. ఈ వైదిక వ్యవస్థ నిర్వీర్యం కావటం సమాజానికి ఎంతో ప్రమాదకరం.