దేవాలయం అంటే -2

ఇసుకతో కూడుకొన్న భూమి అనువైనదిబురదగానున్న భూమినిస్మశాన భూమిని పరిత్యజించాలి. దేవాలయ నిర్మాణానికి ఉపకరించే రాయి. రప్పశిలలోహం ఇత్యాదులు మనుష్యరూపాన్ని నిర్మించే అస్తిపంజరాన్ని పోలి ఉంటాయి. ఈ శరీరానికెలా అలంకార ప్రాయంగా వస్థాభరణాలు అవసరమోఆలయానికివిగ్రహానికి కూడ అలంకార ప్రాయమైన రచన అంతే అవసరం.ఆలయానికి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొన్న తర్వాత ఆలయ నిర్మాణం ఆరంభమవుతుంది. దేవాలయ నిర్మాణంలో అతి ముఖ్యమైన అంశం వాస్తు పురుష మండలాన్ని రచించడం. 

వాస్తు పురుషుడి చిత్రాన్ని వ్రాసి పూజించడంవల్లఆ పురుషుడు మరియు అతనితో ఉన్న దేవతలు అక్కడె నెలకొని ఆలయ నిర్మాణ కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తారట. భూమిని 81 లేక 64 చతురస్రాకార విభాగాలుగా విభజించి మధ్యలో స్తంభాన్ని కానిఅగ్నిని కాని స్తాపించిపూజ చేస్తారు. మధ్యలో ఉన్న ఈ చదరాన్ని బ్రహ్మస్థాన మంటారు. ఒక్కొక్క చతురస్రాకార విభాగంలోను ఒక్కొక్క దేవతను ఆవాహన చేస్తారు. మధ్యనున్న చద రమే వాస్తు యొక్క కేంద్ర స్థానం. ఇక్కడే వాస్తు పురుషుడుంటాడు. వాస్తుపురుషమండలాన్ని స్థాపించిన తర్వాత గర్భన్యాస” మనే విధిని మానవుల్లో గర్భాదానా” నికి  సమానంగా పూర్వులు విధించారు. 

భూమాత – అనుగ్రహం కోసం ఈ కర్మను ఆచరిస్తారు. గర్భగృహ ద్వారం వచ్చే ప్రదేశానికి వెనుక నిర్దిష్టస్థానంలో 25 చతురస్రాకార పల్లలు (తగ్గులు) ఉన్న రాగిపాత్రలో వివిధ శాస్త్ర సమ్మతాలైన వస్తువులను నేలలో పుడ్చడమే గర్భన్యాస కర్మం. నిర్మాణానికి ఉపయోగపడే వస్తోపకరణాలకు పూజ జరిగిన అనంతరం నిర్మాణ కార్యక్రమం సాగుతుంది.దేవాలయ ప్రధాన భగాలుదేవాలయంలో ప్రధాన భాగం చతురస్రాకారంలో ఉన్న గర్భ గృహం” లేదా గర్భగుడి” ఇది దేవాలయానికి హృదయంలాంటిది. 

మనుష్య శరీరంలో ఆత్మ దాగి ఉన్నట్టుగాదేవాలయంలో భగవంతుదు కూడ మానవుడికి అత్యంత సులభంగా దృగ్గోచరం కాకుండేతట్టుగా గర్భగృహం” లో ఆవాసస్థానం పొంది ఉన్నాడు. ఇదే మూలవిగ్రహం” లేదా మూలబేరం” అనబడుతోంది. గర్భగృహంలో ప్రవేశద్వారం తప్పితే మరి ఎలాంటి కిటికీలు కానీ ఉండవు. సాధారాణంగా చీకటి అలుముకొని ఉంటుంది. ఈ చీకటి భక్తుణ్ణి విగ్రహం మీదికి దృష్టిని కేంద్రికరింపచేస్తుంది. 

ఈ లోకాన్ని  మరచి తన్మయత్వాన్ని పొందుతాడు భక్తుడు. తనకు తెలీయనటువంటి అనుభూతిని పొందుతాడు. భక్తుడికి భగవదాకర్హణసంపర్కంఆశీస్సులు ఇక్కడే లభిస్తాయి. భక్తుడు తనలో దైవాన్నిసత్యాన్ని చూస్తాడు.గర్భగృహం పైభాగంలో గోపురం ఉంటుంది. దీన్నే విమానం అంటారు.. ఇదే దేవాలయ వైభవానికి నిదర్శనం. ఇది సాధారణంగా పోతపోసిన విగ్ర్హాలతో అలంకరించబడిఉంటుంది. విమానంమీద శిఖరం ఉంటుంది. శిఖ వున్నది శిఖరం. దాని మీద కలశం వుంటుంది. గర్భగృహంచుట్టు భక్తులు గుడి తిరగడానికి ప్రదక్షిణాపథం” ఉంటుంది. వేసర పద్ధతిలో నిర్మించబడ్డ ఆలయాల్లో ఇది సాధారణంగా ఉండదని అంటారు.గర్భగృహం ముందు భాగంలో ముఖమంటపం” వుంటుంది. దీన్నే అర్ధమంటపం” అని శుకనాసి” అనీ అంటారు. ఇది చతుస్రాకారంలో కానీదీర్ఘ చతుస్రాకారంలో కానీ ఉండి ప్రక్కలలో గోపురం కానీశిఖరం కానీ కలిగి ఉంటుంది. గర్భగృహం ముఖమంటపాలను మహామంటపానికి (హాలు) కలిపే చిన్నమార్గాన్ని అంతరాలం” అంటారు. కొన్ని ఆలయాల్లో ముఖమంటంపమే అంతరాళంగా ఉంతుంది. 

మహామంటపాన్ని నృత్తమంటపం” లేదా నవరంగ” అని కూడ అంటారు. అర్థ మంటపం ప్రవేశ ద్వారాల్లో ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. గర్భగృహం లేదా అంతరాళం లేదా మంటపం ముందుభాగంలో ద్వజస్తంభం ఉంటుంది. దానిమీద వున్న లాంఛనం మూలదేవత వాహనం.ద్వజస్తంభం సమీపంలో దేవుడి పాదచిహ్నం లేదా పద్మం వున్నబలిపీఠం ఉంటుంది. బలిపీఠమ్మీద పరివార దేవతలకు బలి అన్నం పెడతారు. బలిపీఠానికి ఎదురుగా దీపస్తంభం వుంటుంది.సాధారణంగాదేవాలయం ప్రాకారపు గోడలతో చుట్టబడి ఉంటుంది. దీనికి ప్రధానద్వారంతక్కిన మూడు ద్వారాలు ఉంటాయి.

ఈ ద్వరాలమీద ఆకాశాననంటే గోపురాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రాకారం మహద్వారం మీదన్న గోపురాలు అనేక అంతస్తులను కలిగి కళాత్మకంగా ఉంటాయి. కొన్ని దేవాలాయలో 23ప్రాకారాలు కూడా ఉంటాయి. ప్రాకారం లోపల ప్రధానాలయంతో పాటు మరికొన్ని చిన్న చిన్న మందిరాలు కూడ ఉంటాయి. కళ్యాణమంటపంయోగశాలపాకశాలస్వామిపుష్కరిణిఉత్సవమూర్తుల నుంచే గది ఇత్యాదులు సర్వసాధారణంగా ఉంటాయి.సాధారణంగా శివాలయం పట్టణానికి ఈశాన్య దిశలోనువిష్ణ్యాలయం పశ్చిమదిశలోనుసూర్యదేవాలయం తూర్పు దిక్కులోనుదుర్గ ఆలయాలు ఉత్తరదిశలోనుబ్రహ్మాలయం పట్టణ మధ్యభాగంలోను ఉండాలట.సామాన్యంగా శివాలయాల్లో లింగమే మూలబేరంగా ఉంటుది. లింగం ఎత్తునుబట్టి శివాలయాలు ఉత్తమోత్తమఉత్తమమధ్యమ మున్నగు విధాలుగా వర్గీకరించబడతాయి. 

గర్భగుడిలో లింగంతోపాటు ఇచ్చమరియు క్రియా అనే శక్తులు ఉంటాయి. ప్రవేశా ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. వినాయకుడుదక్షిణామూర్తివిష్ణువు లేదా ఆర్థనారీశ్వరుడులింగోద్భవబ్రహ్మదుర్గ మరియు చండీశ్వరాలయాలు సాధారణంగా ప్రధాన ఆలయం చుట్టూ ఉంటాయి. రెండవ ప్రాకరంలో సూర్యవినాయకసుబ్రహ్మణ్యగజలక్ష్మి మరియు భారతదేశం అంతటా ఇదంతా ఒకే లాగ ఉండదు. శైవాలయాల్లో గర్భగుడికి ముందు నంది విగ్రహం ఉంటుంది వైష్ణవాలయల్లో గర్భ గుడికి ముందు బలిపీఠంధ్వజస్థంభాలు కలిగిన గరుడ విగ్రహం ఉంటుంది. తక్కిన చిన్నచిన్న దేవుళ్ళ విగ్రహాలుఆలయాలు కూడా ఆలయప్రాంగణంలో ఉంటాయి. ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. భక్తులు స్నానం చేయడానికి తీర్థం” లేదా పుష్కరిణి” ఆలయ సమీపంలో ఉంటుంది. ప్రసిధ్ధ పుణ్యక్షేత్రాలుదేవాలయాల చెంత పుణ్యతీర్థాలు” ఉంటాయి. 

దైవానికి కాక జలానికి ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను సాధారంగా పుణ్యతీర్థా” అంటారు.ప్రాచీన కాలంనుంచీ ఆంధ్రదేశం శిల్పకళకుచిత్రకళకువాస్తుకళకుపుణ్యక్షేత్రాలకుఇలా మన ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి నేడు మనకు ఉన్న పుణ్యక్షేత్రాలు – దేవస్థానాలు కూడ ఒక సాధనంగా ఉపకరిస్తున్నాయి. శిధిలప్రాయమయిన దేవలయాల్లో కూడ నేటికి పుజా పునస్కారాలు జరుగుతునే ఉన్నాయి. భగవంతుడి మీద ఉన్న భక్తి విశ్వాసాలు దీనికి ప్రత్యక్ష కారణాలైతేనాటి విగ్రహ శిల్పసౌందర్యాన్నీదేవాలయ నిర్మాణాన్ని మట్టిపాలు చేసుకోలేకనాటి ఆంద్రమహా వైభవాన్ని గుర్తుచేసుకొని వాటిని పునరుద్ధరించాలనే మహదాకాంక్ష ప్రరోక్ష కారాణంగా కనిపిస్తుంది.ఎన్నో దేవాలయాలు పరమత ద్వేషం వల్ల మట్టిపాలయ్యాయి. పోయినవి పోగా ఉన్న వాటినైనా నిలుపుకొని వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. అది మనందరి కర్తవ్యం.నేడున్న దేవాలయాలను దర్శంచి  మనంతా గర్వపడాలి. వీటి సందర్శనం పూర్వ జన్మ సుకృతమనే చెప్పాలి. అదొక మహాభాగ్యం అట్టి మహాద్భాగ్యం కోసమే మనం తీర్థయాత్రలు” చేయాలి. ఇది ప్రతియొక్కరి ధర్మమని హిందువుల విశ్వాసం.తీర్థ యాత్రలవల్ల ఆయాప్రాంతాలఅయా ప్రాంతాల జనుల పరిచయం ఏర్పడుతుంది. తద్వారా భావసమైక్యతదేశ సమైక్యత ఏర్పడుతుంది.