ఆదిశంకర భగవత్పాదాచార్య విరచిత కరావలంబ స్తోత్రం ఆవిర్భావం

ఆదిశంకరభగవత్పాదులు ఒకటి లక్ష్మీనృసింహకరావలంబ స్తోత్రం చేశారురెండు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేశారు. ఇంకా ఏమైనా వారు చేసిన కరావలంబ స్తోత్రం ఉన్నాయేమో నాకు తెలియదు. అసలు కరావలంబం అంటే ఏమిటిస్వామి వారిని "మాకు సహాయం చేసే చేతులను ఇవ్వు..." అని వేడుకోవడం. అంటే ఈ సకల లోకాలనూ రక్షించే నీ బాహువులతో మమ్మల్ని రక్షించు అని. కరావలంబ స్తోత్రం చాలా చాలా శక్తివంతమైనది. ఆదిశంకరులు ఒక విపరీతమైన ఆపద సమయములో నరసింహస్వామి వారిని కరావలంబస్తోత్రముతో పిలిస్తేస్వామి తత్క్షణమే వచ్చి ఆదిశంకరులను రక్షించారు. అందుకే వేదము కూడా స్వామి వారిని మొదట నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః అని వెంటనే నమ అస్తు ధన్వనే బాహుబ్యా ముతతే నమః అని చెప్పింది రుద్రం. అంటే స్వామీ మీ బాహువులకు నమస్కారము. లలితా సహస్రనామములలో కూడా అమ్మవారిని కేశాది పాదాది పర్యంతం వర్ణించాలి కదాకానీ మొదట అమ్మవారి యొక్క బాహువుల గురించి చెబుతారు. చతుర్బాహు సమన్వితాయై నమః అని కీర్తించబడినది. ఎందుకు అమ్మవారిని ముందు పాదముల నుంచో లేక కేశాది పాదాది పర్యంతమో స్తోత్రం చేయకుండా ఎందుకు అమ్మవారి బాహువులను కీర్తించారుఅనే విషయానికిపూజ్య గురువు గారు లలితా సహస్ర నామములపై ప్రవచనము చేస్తూ ప్రారంభములోనే చెప్పారు. అసలు రూపమే లేని వాడుమనకోసం ఒక రూపం ధరించిఒక ఆయుధమోముద్రో పట్టిమనల్ని అనుగ్రహించడానికి గుణములు పొందినవాడైవస్తాడు. అటువంటి భగవత్స్వరూపాలను చూస్తేభగవంతుని బాహువులుఆయన చేతులలో పట్టుకునే వాటికి విశేషమైన ప్రాశస్త్యమ్ ఉంటుంది అని గురువు గారు చెప్పారు. 


అందునా శంకరులు మమదేహి కరావలంబం అని అంత అద్భుతమైన రెండు స్తోత్రాలు ఇచ్చారు అంటేవాటిని ప్రతీరోజు మనం అనుసంధానం చేసుకుంటేఏ విధముగా ఆపదల నుంచి రక్షింపబడిస్వామి యొక్క కృపకి పాత్రులము అవుతామో మన ఊహకి కూడా అందదు.