హనుమాన్ తల్లి అయిన అంజనా దేవి చరిత్ర


హనుమంతుని తల్లి అంజనా . తండ్రి కేసరి , శంకరుడు ,వాయువు .ముగ్గురు తండ్రులు ఎలా అయ్యారు అని మీరు అడగవచ్చు. కాని విభిన్న పురాణాలలో విభిన్నగాధలు ఉన్నాయి . కొన్నిటిని ఇక్కడ ముచ్చటిస్తాము.

స్వర్గలోకములో ఇంద్రుని దగ్గర ఎందరో అందమైన అప్సరసలు ఉన్నారు . వారందరిలో మిక్కిలి అందముగా "పుంజికాస్థలా " అనే ఒక అప్సరస ఉంది . ఆమె ఎంతటి అందకత్తో అంతటి సంచల స్వభావము గలది . నవ్వు ఆమె పెదవులపై ఎల్లవేళలా ఉట్టిపడుతుంటుంది . ఒకరోజున తన చంచల స్వభావంచేత ఒకానొక మహర్షిని వేలాకోలం చేసింది . అందుకు కోపపడి మహర్షి "నీవు కోతిమాదిరి చంచలముగా వ్యవహరిస్తావు గనుక భూలోకంలోకి వెళ్లి కోతిగా ఉండు , అని శపించాడు .

మహర్షినోట శాపం వినగానే ఆమెకు మతిపోయి ఆయన పాదాలపై బడి మిక్కిలి వినయముగా అపరాదాన్ని మన్నించమని వేడుకున్నది . మహర్షులు సహజముగా దయకల్గి ఉంటారు . వారి క్రోధం నీటిపైన గీతలాగా కనుపించి మాయమైపోతుంది . ఆయన ప్రసన్నుడై - నేను ఎప్పుడూ అసత్యము పలుకలేదు . నీవు కోతి రూపాన్ని ధరించ వలసిందే , కాని అభీష్టరూపాన్ని ధరిస్తావు . కోరినప్పుడు మానవ రూపాన్ని ధరించగలవు . వానర రూపాన్ని గూడా ధరించగలవు అని అన్నాడు .

మహర్షి శాపం నిజమైంది . పుంజకాస్థల సుమేరుపర్వతగుహలో ఒకవానరిగా జన్మించింది . భూలోకములో వుండే వానరజాతి మాదిరి జాతి కాదు . ఇది ఉపదేవతలలోని కింపురుష జాతికి చెందినది . వీరు అభీష్ట రూపధారులు ,వీరి ఆకృతి మానవాకృతి మాదిరిగానే ఉంటుంది . తోక కూడా ఉంటుంది . కేసరి ఒక వానర రాజు ,అంజనా మిక్కిలి రూపవతి ,కేసరికి ఆమెకు వివాహమైంది . వీరికి సంతానము లేదు . స్త్రీలకూ సహజముగా తల్లికావాలని ,పుత్రుడు కలగాలని కోరిక ఉంటుంది . అంజనా పుత్రప్రాప్తికి భగవాన్ శులపాణిని ఆరాధించింది .


శ్రీరాముడు అవతరించనున్నాడు . తానుగూడ అవనిపై అవతరించి శ్రీరామునికి సేవచేద్దామని శంకరునకు కోరికగలిగినది . శంకరుడు ఏకాదశరుద్రరూపుడు. పదకొండవ అవతారమే హనుమాన్ . శంకరుని వర ప్రసాదము చేత అంజనా గర్భంనుంచి స్వత: శంకరుడు అవతరించినందున హనుమాన్ ని శంకరసూనుడు అని కూడా అంటారు . శంకర వరప్రసాదాన్ని అనురక్తితో పవనదేవుడు అంజనగర్భములొ ఉంచుట చేత పవన కుమారుడైనాడు . కేసరీపత్నికి జన్మించుతచేత కేసరీ నందుడైనాడు .