అతిథిని ఆకలితో వెళ్లనీయకూడదా ?
అతిథి దేవోభవ అనే మాటను మనం
తరచూ వింటూనే వుంటాం. అతిథిని దైవంగా భావించి సేవించాలని పురాణాలు చెబుతున్నాయి.
పూర్వకాలంలో మహర్షుల నుంచి సాధారణ ప్రజల వరకూ అతిథి లేకుండా ఏ పూటకూడా భోజనం
చేసేవారు కాదు. తమ ఇంటికి అతిథి రాని రోజున ఊళ్లోకి వెళ్లి ఆకలితో వున్న ఎవరినో
ఒకరిని వెతికి తీసుకువచ్చి మరీ భోజనం పెట్టేవాళ్లు.

భోజన సమయంలో ఆకలితో వచ్చిన
అతిథిని మర్యాద పూర్వకంగా ఆహ్వానించి సంతృప్తికరంగా భోజనంపెట్టి పంపించాలి.
అప్పుడు అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఆకలితో వచ్చిన అతిథిని పట్టించుకోకుండా
భోజనం చేసిన వారికి నరకలోకప్రాప్తి కలుగుతుంది. ఆకలితో తిరిగివెళ్ళే అతిథి ఆ
కుటుంబీకుల పుణ్యఫలాలను తీసుకెళ్లిపోతాడని శాస్త్రం చెబుతోంది. అందువలన అతిథిని
ఆప్యాయంగా ఆహ్వానించాలి … ఆదరించాలి … రుచికరమైన వంటకాలతో సంతృప్తి పరచాలి. అప్పుడే ఆర్జించిన
పుణ్యం స్థిరంగా వుంటుంది … అతిథిని సేవించిన పుణ్యం
అనంతమవుతుంది.