కుజ గ్రహం

మన పురాణాలలో కుజ గ్రహం ను,అంగారకుడు అని,మంగళుడు అనే
నామాలు ఉన్నాయి.అలాగే కుజుడు
భూమి పుత్రుడు అని కూడా
తెలుసు..ఒక సారి కుజుడు
తన తల్లి తండ్రుల
అనుమతి తీసుకోని వినాయకుడి గురించి
తపస్సు చేయడానికి నర్మదా నది తీరంలో
ఒక ప్రదేశంను ఎంచుకొని
నిరాహారంగా 1000 సంవత్సరాలు గణపతి గురించి తపస్సు
చేసినాడు.అలా 1000 సంవత్సరాలు కుజుడు
తపస్సు చేసినా తరువాత మాఘ
బహుళ చవితి చంద్రోదయం నాడు
వినాయకుడి ప్రతక్ష్యమయ్యాడు.అలా ప్రతక్ష్యమైన వినాయకుడు
ఎలా ఉన్నాడు అంటే దశా
భుజాలు కలిగి బాలుడి గా
ఉన్నాడు.అదే విధంగా వినాయకుడి
తలమీద ఒక చంద్ర వంక
కూడా ఉన్నదీ.
వినాయకుడు,అంగారకుడు తో ఇలా అన్నాడు."
నీ తపస్సుకు మెచ్చితిని
నీకు ఏమి వరం కావాలో
అని కోరుకొమ్మన్నాడు.అప్పుడు అంగారకుడు ఎంతో
సంతోషించి ఆ వినాయకుడిని
ఎన్నో విధములుగా స్తుతించాడు.అలా ప్రతక్ష్యమైన వినయకుడ్నిని
అంగారకుడు తనకు " అమృతం" కావాలని,అదే విధంగా
నేను ఎప్పడు నీ నామ
స్మరణ చేస్తుండాలని అని వరమియమని అంగారకుడు
కోరుకొన్నాడు అప్పుడు వినాయకుడు తదాస్తు
అని దీవించి ,నీవు ఎర్రని
రంగులో ఉన్నావు ఎర్రని వస్త్రం
కట్టుకోన్నావు,ఈ దినం
మంగళవారం.కనుక ఇక నుంచి
నీ పేరు మంగళుడు
అని వరం ఇచ్చి వినాయకుడి
అంతర్ధానం అయ్యాడు.ఆ తర్వాత
అంగారకుడు(మంగళుడు) అమృతం ప్రాప్తిస్తుంది
అమృతం సేవించిన తరువాత కుజుడు(మంగళుడు) ఒక ఆలయం
కట్టించి అందులో వినాయకుడిని ప్రతిష్టించి
,ఆ వినాయకుడిని శ్రీ
మంగళమూర్తి అని పేరు పెట్టాడు.ఈ ఆలయం
ఇప్పటికి మన భారత దేశంలో
ఉంది.అదేవిధంగా వినాయకుడు ఇంకొక వరం కుజుడికి
ప్రసాదించాడు. ఎవరైతే అంగారక చతుర్ధి
రోజు( బహుళ చతుర్ధి ,కృష్ణ
పక్షంలో వచ్చే చతుర్ధి లేదా
పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధి
రోజు) మంగళవారం రోజున ఉపవాసం
ఉండి వినాయకుడికి భక్తి శ్రద్దలతో పూజచేస్తారు
వారికీ ఉన్న అన్ని కుజగ్రహ
దోషాలు అన్ని తొలగిపోతాయి.అని
వరం ప్రసాదించాడు అలాగే వినాయకుడి అనుగ్రహం
కూడా కలుగుతుంది.ఈ పూజా
ఫలం ఎటువంటిది అంటే ఒక సంవత్సరం
సంకష్టి వ్రతం అంటే ఒకక్క
నెలలో ఒక చతుర్ద్ది వస్తుంది..అలా 12 నెలలు ఎవరు
వ్రతం చేస్తారో?అలా చేయడం
వల్ల ఎలాంటి పుణ్య ఫలం
వస్తుందో ఈ ఒక్క
అంగారక చతుర్ధి రోజున చేసీ
వినాయకుడి వ్రతం వల్ల కలేగే
ఫలితం సమానం..అలాగే అన్ని
దోషాలు,ముఖ్యంగా కుజ దోషాలు
సంపూర్ణంగా నివారించాబడతాయి.