లక్ష్మిపూజ ఎలా చేయాలి ?
హిందువులు ప్రత్యేకంగా
లక్ష్మీపూజ చేసే సందర్భాలు కొన్ని ఉన్నాయి. దీపావళి రోజున అలాగే, శ్రావణమాసంలో. శ్రావణమాసంలోని ప్రతిరోజూ లక్ష్మీపూజ
చేయవచ్చు. అయితే దీపావళి రోజు, శ్రావణమాసంలోనూ ఏకరీతిని
లక్ష్మీపూజ ఎలా చేయవచ్చు అంటే...
శ్రీ సూక్త మంత్రాలతోకానీ,
లక్ష్మీ సహస్ర నామాలతో కానీ, లక్ష్మి ఆశతో అష్టోత్తర శత నామాలతో కానీ లక్ష్మిదండకం లేదా
స్తుతితో కానీ లక్ష్మీదేవిని అర్పించాలి. లక్ష్మీదేవిని పూజించే రోజున ఇంటిని
శుభ్రంగా కడిగి, తుడిచి ఇంటిమధ్యలో
ధాన్యాన్ని రాసిగా పోసి, దానిమీద తెల్లని
వస్త్రాన్ని కప్పి, ఆ వస్త్రం మీద లక్ష్మి
విగ్రహాన్ని ఉంచి, ఆమెకి ఇష్టమైన తెల్లని పూలు,
తెల్లని గంధము, తెల్లని వస్త్రాలు, ముత్యాలు మొదలైన
వాటితో
నరసిజనిలయే! సరోజ హస్తే
దవళ తామాంశుక గంధామాల్య
శోభే
భగవతి హరివల్లభే! మనోజ్ఞే
త్రిభువన భూతికరి
ప్రసీదమహ్యమ్
అంటూ పూజించవచ్చు. పై
పద్యంలోని భావం ఏమిటంటే...
పద్మమే నివాసంగా కలదానా,
పద్మాన్ని నీ చేతిలోని ఆభరణంగా ధరించిన దానా,
మిక్కిలి తెల్లనైన వస్త్రాలను, గంధాన్ని మాలికలుగా వేసుకుని రమణీయంగా ఉండేదానా! శ్రీహరికి
భార్యవైనదానా! నా మనసులోని భావాన్ని గ్రహించిన దానా, త్రిభువనాలకీ సంపదనిచ్చే తల్లీ నన్ను రక్షించు అని భావం.
లక్ష్మి కటాక్షం కోసం
భగవద్గీత పారాయణ చేయాలని శాస్త్రం చెబుతోంది. భగవద్గీతలో అధ్యాయాల సంఖ్య 18.
అయ్యప్ప ఆలయంలోని పడిమెట్ల సంఖ్య కూడా 18.
ఈ 18 సంఖ్యకు ఉన్న
విశిష్టత ఏమిటంటే... ఆ సంఖ్యలోని మొదటి అంకెను, రెండవ అంకెను కలిపితే తొమ్మిది వస్తుంది. ఈ తొమ్మిది అనే
సంఖ్య మనిషిలోని చెడును, పాపాలను నాశనం చేస్తుందని
సంఖ్యాశాస్త్రం చెబుతోంది. భగవద్గీత పారాయణ కానీ, అయ్యప్ప దీక్ష 41 కానీ చేసినట్టయితే
లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పద్మపురాణం చెబుతోంది.
యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ
రూపేణ సంస్థితా
నానాస్తస్యై నమో నమః
దీపం జ్యోతి పరబ్రహ్మ,
దీపం సర్వతమోపహరమ్
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యాదీప నమోస్తుతే...
ఈ పద్యం భావం ఏమిటంటే..
దీపం చీకటిని
నశింపచేస్తుంది. జ్ఞానదీపం అంధకారాన్ని నశింపచేస్తుంది. బాహ్య అంధకారాన్ని
అంతర్యముగా ఉండే అజ్ఞానాన్ని పోగొట్టేది జ్ఞానజ్యోతి. అటువంటి జ్ఞానజ్యోతికి
నమస్సులు. అష్టలక్ష్ముల వైభవంతోనే జగత్తు తేజోమయం అయ్యింది. ఈ అష్టలక్ష్మి
శక్తిలేని చోటు ప్రపంచంలో మనకు కనిపించదు. ఈ శక్తులన్నిటినీ అధిదేవత లక్ష్మీదేవే.
అందుకే ఆమెను పూజించాలి. ఆమె కటాక్షం పొందాలి.
నమస్తే సర్వలోకానాం
జననీమజ్జసంభవామ్
శ్రియమున్నిద్ర పద్మాక్షిం
విష్ణువక్షః స్థితామ్
లక్ష్మీ అనుగ్రహం ఎలా పొందాలో మీకు తెలుసా?
సర్వ సంపదలకూ అధినేత్రి
లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసిందే. ఆ
చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్క రాని వాడు కూడా అష్టైశ్వర్యాలూ
అనుభవిస్తాడు. ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకుని, అందుకు తగ్గట్లుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా
జీవించవచ్చు.
1.గుమ్మానికి పక్కనే
చిందరవందరగా పాదరక్షలను విడవడం, గుమ్మాన్ని కాలితో తొక్కి
లోపలకు రావడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. అందుకే పెద్దలు ఆ పనులు చేయనివ్వరు.
2.సూర్యోదయ, సూర్యాస్తమయాలలో నిద్రించే వారు, భుజించేవారు, పగటిపూట
నిద్రించేవారు లక్ష్మీదేవి కృపకు నోచుకోరు.
3.శుచి, శుభ్రత, సహనం కలిగి, ధార్మికంగా, నైతికంగా జీవించేవారు
లక్ష్మీదేవికి ఇష్టులు.
4.చిల్లర పైసలను, పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారు, ముక్కోపులు, దురహంకారులు లక్ష్మీదేవి
అనుగ్రహానికి దూరంగా ఉంటారు.
5.బద్దకస్తులు, అతిగా మాట్లాడేవారు, అమితంగా తినేవారు, గురువులనూ, పెద్దలనూ అవమానించేవారు, అపరిశుభ్రంగా ఉండేవారు, జూదరులు, అతినిద్రాలోలు ఇంటి
ముంగిటికి కూడా లక్ష్మీదేవి కాలిడదు.
6.లక్ష్మీదేవి అనుగ్రహం
పొందాలంటే ఆకుపచ్చని వస్త్రాలను ధరించి, ఆమెకు ఎర్రని
వస్త్రాలను, పరిమళభరితమైన పూలను
అలంకరించి, ధూపదీప నైవేద్యాలను
సమర్పించి, పాలు, పాలతో చేసిన పదార్థాలను నివేదించడం శ్రేష్ఠం.
7.బంగారాన్ని నడుం కింది
భాగంలో ధరిస్తే లక్ష్మీదేవిని కించపరచినట్లే. అందుకే కాళ్లపట్టాలు, మట్టెలూ వెండివి మాత్రమే ధరించాలి.
8.ఉసిరిపొడిని నీటిలో కలిపి
తలస్నానం చేసి, శుచీశుభ్రతలతో
దేవీభాగవతంలోని మహాలక్ష్మి క్షీరసాగరం నుండి ఆవిర్భవించిన భాగాన్ని అధ్యయనం చేయడం
వల్ల పోయిన సంపదలన్నీ తిరిగి లభిస్తాయని శాస్త్రోక్తి.
9.లక్ష్మీదేవికి నివేదించే
పిండివంటలను నూనెతో కాకుండా నేతితో తయారు చేస్తే శ్రేష్ఠం.
10. ఇంట్లో లక్ష్మీదేవి నిలబడి
ఉన్న పటం కాకుండా పద్మంలో కూర్చున్న పటం ఉంచుకోవాలి.
11. శ్రీలక్ష్మీ క్షమాగుణం, శాంత గుణం అనే ఆరెండు గుణాల్లో ఉంటుంది. ఈ రెండు గుణాలు
ఉన్నవార్ని లక్ష్మీదేవి సదా అనుగ్రహిస్తుంది
సంపదలు తెచ్చిపెట్టే లక్ష్మీ గవ్వలు
లక్ష్మీ గవ్వలను, లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు.
గవ్వలు స్థూలంగా ఒకటే
ఆకృతిలో ఉన్నప్పటికీ చిన్న చిన్న తేడాలతో అనేక రకాలు ఉన్నాయి. ఈ గవ్వల్లో పసుపు
రంగులో మెరిసే గవ్వల్ని లక్ష్మీ గవ్వలు అంటారు. ఈ లక్ష్మీ
గవ్వలు గనుక పూజామందిరంలో ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి తాండవమాడుతుంది.
అసలు లక్ష్మీ గవ్వలు
ఎక్కడివి, ఎలా వచ్చాయి అనే సందేహం
కలుగుతోందా? అయితే లక్ష్మీ గవ్వలు
గురించిన సందేహాన్ని వెంటనే నివృత్తి చేసుకుందాం. క్షీర సాగర మధనం సమయంలో అమృతం,
హాలాహలంతో పాటు శంఖాలు, లక్ష్మీ గవ్వలు కూడా ఉద్భవించాయట. శంఖాన్ని లక్ష్మీదేవి
సోదరునిగా, గవ్వను సోదరిగా భావిస్తారు.
ఆ విధంగా లక్ష్మీ గవ్వలు, లక్ష్మీదేవికి ప్రతిరూపం
అయ్యాయి.
గవ్వను లక్ష్మీదేవి
చెల్లెలిగా భావించేవారు కనుక, నాణాలు, రూపాయలు పుట్టకముందు వాటినే కాసులుగా వాడేవారు. ఆర్ధిక
లావాదేవీల్లో గవ్వలనే మారకంగా వినియోగించేవారు. అంటే, ఒకప్పుడు డబ్బుకు మారుగా గవ్వలే ఉమడేవన్నమాట. ఎవరి దగ్గర
ఎక్కువ గవ్వలు ఉంటే వారే ధనవంతులు. గవ్వలకు చాలా ప్రాధాన్యత ఉండేది. గవ్వలు
లేనివాళ్ళు నిరుపేదలు. ఇప్పటికీ బొత్తిగా డబ్బు లేదని చెప్పడానికి ''చిల్లి గవ్వ కూడా లేదు'' అనడం ఎన్నోసార్లు విని ఉంటాం.
గవ్వలను కాసులుగా
వినియోగించారంటే, అందుకు కారణం లేకపోలేదు.
లక్ష్మీ గవ్వలు సామాన్యమైనవి కావు. వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీ గవ్వలు
కనుక ఇంట్లో ఉంటే సంపదలు వచ్చిపడతాయి. ధనధాన్యాలు వృద్ది చెందుతాయి. అంటే, గవ్వలకు, లక్ష్మీదేవికి అవినాభావ
సంబంధం ఉంది. ఎక్కడ లక్ష్మీ గవ్వలు ఉంటాయో, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే, మన పూర్వీకులు గవ్వలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు.
అదీ లక్ష్మీ గవ్వల
విశిష్టత. అందుకే పూజామందిరంలో లక్ష్మీదేవి విగ్రహం తోబాటు శంఖాన్ని, లక్ష్మీ గవ్వలను కూడా పీఠంపై ఉంచి ప్రార్ధించడం ఆనవాయితీ.
మీరు కూడా లక్ష్మీ గవ్వలను సంపాదించి పూజా మందిరంలో ఉంచండి. సిరిసంపదలను
పెంచుకోండి.
అవయవాలు ఆదరడం
అవయవాలు కొన్ని సెకండ్లు మాత్రమే అదిరితే మంచిది, అదురుతునే వుంటే ఏదో రోగానికి సంకేతం
ఆడవాలకి - నడి నెత్తి మీద అదిరితే - బ్రుష్టాన్న భోజనం
పురుషులకి - ఎడమ కన్ను అదిరితే - నష్టం
ఆడవాలకి - ఎడమ కన్ను అదిరితే - అనుకోని చాల మంచి పనులు జరుగుతాయి.
ముక్కు ఎడమవైపు అదిరితే - రోగం
ముక్కు కుడి వైపు అదిరితే - సుభకరం
కుడి చెంప వైపు అదిరితే - చాల విజయాలు వస్తాయి
ఎడమ చెంప వైపు అదిరితే - శత్రువు వలన నష్టం వస్తుంది.
పురుషులకి - పెదవి ఎడమవైపు అదిరితే - భోజనం దొరకదు అ రోజు
పెదవి కుడి వైపు అదిరితే - మంచి భోజనం చేస్తారు
పురుషులకి కుడి చేయి అదిరితే - మంచి ఉద్యోగం ప్రాప్తి / చేతులతో చెఅసె పని మంచిగా అవుతుంది .
పురుషులకి ఎడమ చేయి అదిరితే - ఉద్యోగ లో పై అధికారులతో ఇబంది వస్తుంది.
పురుషులకి ఎడమ తొడ అదురుతుంది - స్థాన బ్రంసం / ఉద్యోగం లో ఇబంధులు - అంత మంచిది కాదు
ఆడవాలకి ఎడమభాగం మేలు చేస్తుంది . కుడిభాగం అంత మంచిది కాదు(కీడును సూచిస్తుంది).
పురుషులకి కుడిభాగం మేలు చేస్తుంది. ఎడమభాగం అంత మంచిది కాదు(కీడును సూచిస్తుంది).
ఆడవాలకి - నడి నెత్తి మీద అదిరితే - బ్రుష్టాన్న భోజనం
పురుషులకి - ఎడమ కన్ను అదిరితే - నష్టం
ఆడవాలకి - ఎడమ కన్ను అదిరితే - అనుకోని చాల మంచి పనులు జరుగుతాయి.
ముక్కు ఎడమవైపు అదిరితే - రోగం
ముక్కు కుడి వైపు అదిరితే - సుభకరం
కుడి చెంప వైపు అదిరితే - చాల విజయాలు వస్తాయి
ఎడమ చెంప వైపు అదిరితే - శత్రువు వలన నష్టం వస్తుంది.
పురుషులకి - పెదవి ఎడమవైపు అదిరితే - భోజనం దొరకదు అ రోజు
పెదవి కుడి వైపు అదిరితే - మంచి భోజనం చేస్తారు
పురుషులకి కుడి చేయి అదిరితే - మంచి ఉద్యోగం ప్రాప్తి / చేతులతో చెఅసె పని మంచిగా అవుతుంది .
పురుషులకి ఎడమ చేయి అదిరితే - ఉద్యోగ లో పై అధికారులతో ఇబంది వస్తుంది.
పురుషులకి ఎడమ తొడ అదురుతుంది - స్థాన బ్రంసం / ఉద్యోగం లో ఇబంధులు - అంత మంచిది కాదు
ఆడవాలకి ఎడమభాగం మేలు చేస్తుంది . కుడిభాగం అంత మంచిది కాదు(కీడును సూచిస్తుంది).
పురుషులకి కుడిభాగం మేలు చేస్తుంది. ఎడమభాగం అంత మంచిది కాదు(కీడును సూచిస్తుంది).
సంతానం కోసం జపం/ దానం/వ్రతం/పారాయణం/స్నానం
సంతానం కోసం దీక్ష తో పారాయణం చేయాలి
- రామాయణం
- శ్రీ కృష్ణ భాగవతం
- దత్త చరిత్ర
- హరివంశ పారాయణం
సంతానం కోసం దానం
అమృత ఫలం దానం ఇవలి
వెలగ పండు / కర్జురం దానం ఇవాలి.
సంక్రాంతి రోజు పెరుగు దానం ఇస్తే మంచి పిల్లలు పుడతారు. కొత్త కంచు పాత్ర లో నాటు ఆవు పాలు తేచి తోడు పెట్టి(పెరుగు తీయగా వుంటుంది) వేదం చదువుకునే వృధా దంపతులకి /గురువు గురు పత్ని కి / బ్రాహ్మణ / దంపతులకి (కులం తో పని లేదు ). సత్సంతనం కలుగుథున్ధి.
సంతానం కోసం వ్రతం
- పౌర్ణమి రోజు ఉపవాసం తో సంతానం కోసం ఒక సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి.
- పుత్రదయి ఏకాదశి- శ్రావణ సుధా ఏకాదశి/పుష్య సుధా ఏకాదశి నుంచి మొదలు పెట్టి ఒక సంవత్సర కాలం ఏకాదశి వ్రతం చేస్తే సంవత్సరం లోపులో సంతానం కలుగుతుంది.
- దత్త చరిత్ర సప్తాహం (7 రోజులో చదవటం)
- సూర్య వ్రతం.
- షష్టి వ్రతం - వల్లి దేవసేన సుబ్రమణ్య - మార్గశిర సుధా షష్టి లేదా మాఘమాసం లో కానీ మర్ఘసిర్ష మాసం లో వచ్చే షష్టి ప్రతి షష్టి రోజున దంపతులు ఇదరు పూజ చేయాలి. క్రుతిరిక నక్షత్రం రోజున కూడా పూజ చేయాలి .
- షష్టి దేవి విగ్రహాని సాలిగ్రామం మీద కానీ శ్రీ చక్రం మీద కానీ పెటాలి. ఫోటో అయితే ఎదురుగుండా శ్రిచాక్రని పెటాలి. (షష్టి దేవి అమ్మవారి 6వ అంస గ చెప్తారు). 1008 సార్లు షష్టి స్తోత్రాని ఎవరు పైన చెపిన విన్దంగా అమ్మవారిని పూజ చేస్తారో వారికీ సంతానం కలుగుతుంది . దీక్ష ని బట్టి 40(మండలం) , 108 రోజులు, 11 రోజులు చెస్తున దాని బట్టి ఈ లోపులో 1008 సార్లు పూర్తి చేయాలి.
- శ్రీ కృష్ణ అష్టమి వ్రతం - ప్రతి కృష్ణ అష్టమి రోజున వ్రతం లాగ చేయటం.
తేలవరుఝామున లేచి గణపతి కి లలిత పరమేస్వరికి దీపారాధన చేసి రుక్మినిక్రిష్ణులు/లక్ష్మీనారాయణ చిత్రపటాలు పెట్టుకుని, వల్లి దేవసేన సుబ్రమణ్య చిత్ర పాటని పెట్టుకుని దీపారాధన చేసి దంపతులు ఇదారు లలితసహస్రనమలు చదవాలి.
ఉపాసన వున్నా వాలు అయితే బీజాక్షరాలతో-పూల /పళ్ళు /అక్షింతలు /పత్రీ తో కానీ అర్చన చేయాలి. అది చేస్తుననసేపు వెండి పలెం లో కానీ తమలపాకు లో కానీ ఆవు వెన్న ని చేతి లో పట్టుకుని పారాయణం చెయలి.
2 అమృత ఫలం (కర్జురం) లో కొంచం తేనె వేసి నివేదించి దంపతులు ఇదరు మాత్రమే తినాలి.
సంతాన గోపాలస్వామి మంత్రం
లలితసహస్రనామలు
గర్బరక్షంబిక మంత్రం
చదువుకుంటూ ఆవు వెన్న నయివేద్యం పెట్టి భార్య భర్త ఇదరు తినాలి.
సంతానం కోసం స్నానం
- సర్ప సూక్తం చదువుకుంటూ - నాగ ప్రతిష్ట శ్రీశైలం/ రామేశ్వరం లో చేస్తే మంచిది.
- సేతు స్నానం (రామ సేతు దగర స్నానం చేస్తే సంతన దోషాలు పోతాయి)
- శివ లింగ ప్రతిష్ట.
- పాడయిపోతున దేవాలయాలు/ జీర్ణం అయిపోతున దేవాలయాలు పునరుధరిస్తే (ధూపం, దీపం, నేయివేద్యం) అనేక దోషాలు పోతాయి .
నాగదోషం పోవడం కోసం
సర్ప సూక్తం పారాయణం చేయటం - కళ్యాణ స్థానం లో వున దోషం పోవటం కోసం
సప్తమ స్థానం లో/కి దోషం ఏర్పడడం వలన - ఎ జన్మలో నాగదోషం ఏర్పడుతుంది . పోవడానికి గరుడ ప్రదక్షిణ చేయలి.
సంతానం కోసం మంత్రం
- సుబ్రమణ్య స్వామి మంత్రం
- సంతగోపల స్వామి మంత్రం
- గర్బరక్షంబిక మంత్రం
గర్భం దాల్చిన తరువాత చదువుకోవలిసినవి
పొట్ట మీద చేయవేసి -
స్కంద కవచం
నారాయణ కవచం
నిత్యం పాటించాల్సిన మంత్రాలూ : -
సంతగోపల స్వామి మంత్రం
గర్బరక్షంబిక మంత్రం
పొట్ట మీద చేయవేసి -
స్కంద కవచం
నారాయణ కవచం
నిత్యం పాటించాల్సిన మంత్రాలూ : -
సంతగోపల స్వామి మంత్రం
గర్బరక్షంబిక మంత్రం
ఆలస్య సంతానం
లగ్నము , చంద్రుడు , గురువు - వీటికి సుభ సంబంధం లేకపోతే సంతానం అస్సలు కలుగదు.
మాతృ శాపం-పితృ శాపం పోవడానికి
మాతృ శాపం/పితృ శాపం పోవడానికి
- రామాయణ పారాయణం
- శివ/విష్ణు పురాణం శ్రవణం/పారాయణం
పితృ శ్రాధం కర్మ చేస్తే వారికీ పితృ శాపం నుంచి విముక్తి దొరుకుతున్ధి.
- ఒరిస్సా లో బిరాజ క్షేత్రం వెనకాల వైతరిని నది వుంది అకడ శ్రార్ధం పెతలి.
- కాళహస్తి
- స్వర్ణ ముఖి నది లో స్నానం చేసి శ్రార్ధం పెటాలి.
- శ్రీశైలం
- సప్తగోదావరి తీరం
- కాశి / ప్రయాగ / గయా /హరిద్వార్ / బద్రి
వధువరులకు చుడవాలిసినవి
వధువరులకు మొదట చుడవాలిసినవి
అంత్య నాడి
మద్య నాది
వధువరులకు ఇదరికి ఒకటే నాడి అవ్వకూడదు. గుణాలు - 8
2. రాశి కూటమి
గుణాలు - 7
వధువు నుంచి వరుడికి చూడాలి. అందులో ఇదరిది షష్ఠటాష్టకం కాకూడదు. ద్వాదశం కాకూడదు, నవమ్ పంచకం కాకూడదు.
షష్ఠటాష్టకం 2 రకాలు :
శుభ షష్ఠటాష్టకం - ప్రీతీ షష్ఠటాష్టకం
అశుభ షష్ఠటాష్టకం - మృత్యు షడస్టకమ్
శుభ షష్ఠటాష్టకం - ప్రీతీ షష్ఠటాష్టకం - దోషం లేదు
షష్ఠటాష్టకం చూసే విధానం :
వధువు కి చంద్రుడు ఎ రాశి లో ఉన్నాడు, వరుడు కి చంద్రుడు ఎ రాశి లో ఉన్నాడు చూసి వధువు నుంచి వరుడుకీ లేకించాలి. ఒకవేళ ఎ రాశులలో షష్ఠటాష్టకం పడిన పరవాలేదు, దోషం లేదు.
అశుభ షష్ఠటాష్టకం - మృత్యు షడస్టకమ్ - చెడు జరుగుతుంది.
వధువు నుంచి వరుడుకీ 6, 8 రాసులు అవ్వకూడదు.
3. ద్విర్ద్వాదసి 2 రకాలు - వధువు నుంచి వరుడుకీ 2,12/5,9/6,8.
సుభ ద్విర్ద్వాదసి
అశుభ ద్విర్ద్వాదసి
సుభ ద్విర్ద్వాదసి - దోషం లేదు
అశుభ ద్విర్ద్వాదసి
4. గ్రహమైత్రి
గుణాలు - 5
మిత్ర గ్రహాలు
శత్రు గ్రహాలు
సమాన గ్రహాలు - శత్రువు లు కాదు అలాగని మిత్రులు కాదు. మిగతావి కుదిరితే అంటే రాశి కూటమి & నాడి కూటమి బాగుంటే సమాన గ్రహాలు అయిన పరవాలేదు.
వధువరుల రాశి అధిపతులు శత్రువు అయితే చేయకూడదు.
ప్రేమించుకునే వాలకి / మేనరికం / తెలిసిన /కావలిసిన వాళ్ళకి తప్పకుండ చేసుకోవాలి అనుకునపుడు రాసి కూటమి కలవనప్పుడు/ గ్రహ మైత్రి కుదరకపోయినా, నవాంస లో ఇదరికి వుండే నవాంస చక్రం లో చంద్రుడు వరుడు కి నవాంస లో మిత్రత్వం వున్నా పర్వాలేదు.
5. గణ కూటమి
గుణాలు - 6
దేవా గణం
మనుష్య గణం
రాక్షసి గణం
రాక్షసి గణం - మనుష్య గణం - అస్సలు చేయకూడదు.
వధువరుల లో ఒకరిది కింద ల వున్నా పరవాలేదు
ఘార్గ మహర్షి చెపిన స్లోకలో ఇలా వుంది:
గ్రహమైత్రి , రాశి కూటమి , నాడి కూటమి బాగుండి, జాతక చక్రం లో మిగతా దోషాలు ఏమి లేకుండా వుంటే మనుష్య గణం-రాక్షసి గణం అయిన పరవాలేదు.
దాస కూటాలు ఉనాయి
అష్ట కూటము లు చూస్తారు
వర్న్ కూటమి
యోని కూటమి
తార కూటమి
వస్య కూటమి
గ్రహమైత్రి , రాశి కూటమి , నాడి కూటమి కచితంగా కలవాలి. మిగతా కూటమి లో దోషాలు వున్నా పర్వాలేదు.
వధు వరులకి కళత్ర స్థానం 7(సప్తమ స్థానం)
అమ్మాయి కి కళత్ర స్థానం లో భర్త / అబ్బాయి కి కళత్ర స్థానం లో భార్య స్థానం లో దోషం ఉండకూడదు , పాప గ్రహాలు ఉండకూడదు . అ స్థానాదిపతి దుస్థానలో ఉండకూడదు.
మన: కారకుడు చంద్రుడు ఎకడ వునాడు చూసి ఎడారికి ఇది సరిపోతుంద లేదా.
గణ మెలనె పట్టిక - చూసేటపుడు ముందుగ నాడి కూటమి, రాశి కూటమి, గ్రహమైత్రి. వీటి పాఇంట్లు చూసి తరువాత మిగిలిన కూటమి చూసుకోవాలి .
ఇవి కూడా చుస్కోవాలి
అయిషు
వైదవ్య యోగాలు
వివాహేతర సంబందాలు ఉంటాయ
ఆరోగ్యం
రవి , చంద్రుడు , కుజుడు కూడా చూస్తే చాల మంచిది.
రవి బలవంతుడై, ఉచ్ఛస్థానం లోకాని . సప్తమ స్థానం లో కానీ, లగ్న స్థానం, వక్క్ స్థానం.
చంద్రుడు - ఇదరికి బాలన్స్ అయేలా చూడాలి.
సమ సప్తకం - ఇదరికి ఒకలా రాసి నుంచి ఒకలకి , ఒకలా లగ్నం నుంచి ఒకలకి ఎదురు ఎదురుగా వుండడడం. దానివల్ల దోషం లేదు అని చెప్తూ వుంటారు కానీ ,
కుంభ రాశి - సింహ రాశి సమ సప్తకాలే అవుతాయి కానీ ఇదరికి పరమ శత్రుత్వం. ఇలా వున్దడ్డం వల్ల కుంభ రాశి వాళ్ళు సింహ రాశి వారికీ ఎప్పుడు బయపడుతూ వుంటారు.
1. నాడి కూటమి
ఆది నాడి అంత్య నాడి
మద్య నాది
వధువరులకు ఇదరికి ఒకటే నాడి అవ్వకూడదు. గుణాలు - 8
2. రాశి కూటమి
గుణాలు - 7
వధువు నుంచి వరుడికి చూడాలి. అందులో ఇదరిది షష్ఠటాష్టకం కాకూడదు. ద్వాదశం కాకూడదు, నవమ్ పంచకం కాకూడదు.
షష్ఠటాష్టకం 2 రకాలు :
శుభ షష్ఠటాష్టకం - ప్రీతీ షష్ఠటాష్టకం
అశుభ షష్ఠటాష్టకం - మృత్యు షడస్టకమ్
శుభ షష్ఠటాష్టకం - ప్రీతీ షష్ఠటాష్టకం - దోషం లేదు
షష్ఠటాష్టకం చూసే విధానం :
వధువు కి చంద్రుడు ఎ రాశి లో ఉన్నాడు, వరుడు కి చంద్రుడు ఎ రాశి లో ఉన్నాడు చూసి వధువు నుంచి వరుడుకీ లేకించాలి. ఒకవేళ ఎ రాశులలో షష్ఠటాష్టకం పడిన పరవాలేదు, దోషం లేదు.
అశుభ షష్ఠటాష్టకం - మృత్యు షడస్టకమ్ - చెడు జరుగుతుంది.
వధువు నుంచి వరుడుకీ 6, 8 రాసులు అవ్వకూడదు.
3. ద్విర్ద్వాదసి 2 రకాలు - వధువు నుంచి వరుడుకీ 2,12/5,9/6,8.
సుభ ద్విర్ద్వాదసి
అశుభ ద్విర్ద్వాదసి
సుభ ద్విర్ద్వాదసి - దోషం లేదు
అశుభ ద్విర్ద్వాదసి
4. గ్రహమైత్రి
గుణాలు - 5
మిత్ర గ్రహాలు
శత్రు గ్రహాలు
సమాన గ్రహాలు - శత్రువు లు కాదు అలాగని మిత్రులు కాదు. మిగతావి కుదిరితే అంటే రాశి కూటమి & నాడి కూటమి బాగుంటే సమాన గ్రహాలు అయిన పరవాలేదు.
వధువరుల రాశి అధిపతులు శత్రువు అయితే చేయకూడదు.
ప్రేమించుకునే వాలకి / మేనరికం / తెలిసిన /కావలిసిన వాళ్ళకి తప్పకుండ చేసుకోవాలి అనుకునపుడు రాసి కూటమి కలవనప్పుడు/ గ్రహ మైత్రి కుదరకపోయినా, నవాంస లో ఇదరికి వుండే నవాంస చక్రం లో చంద్రుడు వరుడు కి నవాంస లో మిత్రత్వం వున్నా పర్వాలేదు.
5. గణ కూటమి
గుణాలు - 6
దేవా గణం
మనుష్య గణం
రాక్షసి గణం
రాక్షసి గణం - మనుష్య గణం - అస్సలు చేయకూడదు.
వధువరుల లో ఒకరిది కింద ల వున్నా పరవాలేదు
ఘార్గ మహర్షి చెపిన స్లోకలో ఇలా వుంది:
గ్రహమైత్రి , రాశి కూటమి , నాడి కూటమి బాగుండి, జాతక చక్రం లో మిగతా దోషాలు ఏమి లేకుండా వుంటే మనుష్య గణం-రాక్షసి గణం అయిన పరవాలేదు.
దాస కూటాలు ఉనాయి
అష్ట కూటము లు చూస్తారు
వర్న్ కూటమి
యోని కూటమి
తార కూటమి
వస్య కూటమి
గ్రహమైత్రి , రాశి కూటమి , నాడి కూటమి కచితంగా కలవాలి. మిగతా కూటమి లో దోషాలు వున్నా పర్వాలేదు.
వధు వరులకి కళత్ర స్థానం 7(సప్తమ స్థానం)
అమ్మాయి కి కళత్ర స్థానం లో భర్త / అబ్బాయి కి కళత్ర స్థానం లో భార్య స్థానం లో దోషం ఉండకూడదు , పాప గ్రహాలు ఉండకూడదు . అ స్థానాదిపతి దుస్థానలో ఉండకూడదు.
మన: కారకుడు చంద్రుడు ఎకడ వునాడు చూసి ఎడారికి ఇది సరిపోతుంద లేదా.
గణ మెలనె పట్టిక - చూసేటపుడు ముందుగ నాడి కూటమి, రాశి కూటమి, గ్రహమైత్రి. వీటి పాఇంట్లు చూసి తరువాత మిగిలిన కూటమి చూసుకోవాలి .
ఇవి కూడా చుస్కోవాలి
అయిషు
వైదవ్య యోగాలు
వివాహేతర సంబందాలు ఉంటాయ
ఆరోగ్యం
రవి , చంద్రుడు , కుజుడు కూడా చూస్తే చాల మంచిది.
రవి బలవంతుడై, ఉచ్ఛస్థానం లోకాని . సప్తమ స్థానం లో కానీ, లగ్న స్థానం, వక్క్ స్థానం.
చంద్రుడు - ఇదరికి బాలన్స్ అయేలా చూడాలి.
సమ సప్తకం - ఇదరికి ఒకలా రాసి నుంచి ఒకలకి , ఒకలా లగ్నం నుంచి ఒకలకి ఎదురు ఎదురుగా వుండడడం. దానివల్ల దోషం లేదు అని చెప్తూ వుంటారు కానీ ,
కుంభ రాశి - సింహ రాశి సమ సప్తకాలే అవుతాయి కానీ ఇదరికి పరమ శత్రుత్వం. ఇలా వున్దడ్డం వల్ల కుంభ రాశి వాళ్ళు సింహ రాశి వారికీ ఎప్పుడు బయపడుతూ వుంటారు.
రోగం పోవడానికి /ఎకువగా నెగటివ్ గ ఆలోచనలు వున్నా- రాహువు
రాహువు 5 లో వుండి పాప గ్రహాలతో కలిసి వుంటే - అనవసరంగా భయపడుతున/ ఎక్కువగా బ్రమలు/ ఎకువగా నెగటివ్ గ ఆలోచనలు వుంటాయి.
నివారణగా :
దుర్గ కవచం
దుర్గ మంత్రం జపం
దుర్గ సప్త స్లోకి చదవటం
దుర్గ దేవాలయానికి ప్రదక్షిణ చేయటం
చిన్న పిల్లలికి దుర్గ లోకేట్ వేయటం
దుర్గ అభిషేకం దుర్గ అర్చన
రాహువు మంచి కూడా చేస్తాడు - రాహువు 3,6,11 లో వుండి పాప గ్రహాలతో వున్నా కూడా అ జాతకం లో వున్నా దోషాలు అని పోతాయి.
రాహువు మహార్దాస -
రాహువు అష్టమాన (8) / రోగాస్తాణాదిపతి తో కలిసి వుంటే +చంద్ర బుద సంబంధం కూడా వుంటే - చర్మ వ్యాదులు వస్తాయి .
రాహువు + శని /కుజుడు తో కలిసి వుంటే - మలిగ్నేన్సి(విష పూరితమయిన) తో వుండే జబ్బులు వస్తాయి.
తీవ్రతరమయిన రోగాలు రాకుండా వుండనికి/ వచ్చిన పోవడానికి చండి సప్తసతి -25 పారాయణం చేస్తే తపకుండా విష పూరితమయిన రోగ నివారణ/రాకుండా కూడా ఉండవచు.
నివారణగా :
దుర్గ కవచం
దుర్గ మంత్రం జపం
దుర్గ సప్త స్లోకి చదవటం
దుర్గ దేవాలయానికి ప్రదక్షిణ చేయటం
చిన్న పిల్లలికి దుర్గ లోకేట్ వేయటం
దుర్గ అభిషేకం దుర్గ అర్చన
రాహువు మంచి కూడా చేస్తాడు - రాహువు 3,6,11 లో వుండి పాప గ్రహాలతో వున్నా కూడా అ జాతకం లో వున్నా దోషాలు అని పోతాయి.
రాహువు మహార్దాస -
రాహువు అష్టమాన (8) / రోగాస్తాణాదిపతి తో కలిసి వుంటే +చంద్ర బుద సంబంధం కూడా వుంటే - చర్మ వ్యాదులు వస్తాయి .
రాహువు + శని /కుజుడు తో కలిసి వుంటే - మలిగ్నేన్సి(విష పూరితమయిన) తో వుండే జబ్బులు వస్తాయి.
తీవ్రతరమయిన రోగాలు రాకుండా వుండనికి/ వచ్చిన పోవడానికి చండి సప్తసతి -25 పారాయణం చేస్తే తపకుండా విష పూరితమయిన రోగ నివారణ/రాకుండా కూడా ఉండవచు.
శ్రీ వినాయక వ్రతకల్పము
పూజకు కావలసిన సామాగ్రి
1. లేవవలసిన సమయము : ఉదయం 5 గంటలు.
2. శుభ్రపరచవలసినవి :
పూజామందిరము, ఇల్లు.
3. చేయవలసిన అలంకారములు :
గడపకు పసుపు, కుంకుమ; గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు.
4. చేయవలసిన స్నానము :
తలస్నానము
5. ధరించవలసిన పట్టుబట్టలు :
ఆకుపచ్చరంగు పట్టు వస్త్రాలు
6. పూజామందిరంలో చేయవలసినవి :
పూజకు ఉపయోగపడు వస్తువులు టములకు గంధము, కుంకుమ
అలంకరించాలి.
7. కలశముపై వస్త్రము రంగు :
ఆకుపచ్చ రంగు
8. పూజించవలసిన ప్రతిమ :
బంకమట్టితో చేసిన గణపతి
9. తయారు చేయవలసిన అక్షతలు :
పసుపు రంగు
10. పూజకు కావలిసిన పువ్వులు :
కలువపువ్వులు, బంతి పువ్వులు
11. అలంకరణకు వాడవలసిన పూలమాల :
చామంతిమాల
12. నివేదన చేయవలసిన నైవేద్యం :
ఉండ్రాళ్ళు
13. సమర్పించవలసిన పిండివంటలు :
బూరెలు, గారెలు
14. నివేదించవలసిన పండ్లు :
వెలక్కాయ
15. పారాయణ చేయవలసిన అష్టోత్తరం
: గణపతి అష్టోత్తరము
16. పారాయణ చేయవలసిన స్తోత్రాలు
: సంకటనాశన గణేశ స్తోత్రం
17. పారాయణ చేయవలసిన ఇతర
స్తోత్రాలు : ఋణవిమోచక గణపతి స్తోత్రము
18. పారాయణ చేయవలసిన సహస్రాలు :
గణపతి సహస్ర నామం
19. పారాయణ చేయవలసిన గ్రంధం :
శ్రీ గణేశారాధన
20. పారాయణ చేయవలసిన అధ్యాయములు
: గణపతి జననం
21. దర్శించవలసిన దేవాలయాలు :
గణపతి
22. దర్శించవలసిన
పుణ్యక్షేత్రాలు : కాణిపాకం, అయినవిల్లి
23. చేయవలసిన ధ్యానములు : గణపతి
ధ్యాన శ్లోకం
24. చేయించవలసిన పూజలు : 108 ఉండ్రాళ్ళుతో పూజ
25. దేవాలయములో చేయించవలసిన
పూజా కార్యక్రమములు : గరికెతో గణపతి గకార అష్టోత్తరం
26. ఆచరించవలసిన వ్రతము :
వినాయక వ్రతము
27. సేకరించవలసిన పుస్తకములు :
శ్రీగణేశారాధన, శ్రీగణేశోపాసన
28. సన్నిహితులకు శుభాకాంక్షలు
: కాణిపాక క్షేత్ర మహత్యం
29. స్త్రీలకు తాంబూలములో
ఇవ్వవలసినవి : గరికెతో గణపతి పూజలు
30. పర్వదిన నక్షత్రము : హస్త
31. పర్వదిన తిధి : భాద్రపద
శుద్ధ చవితి
32. పర్వదినమున రోజు పూజ
చేయవలసిన సమయం : ఉ||9 నుండి 12 గం|| లోపుగా
33. వెలిగించవలసిన దీపారాధన
కుంది : కంచుదీపారాధనలు
34. వెలిగించవలసిన దీపారాధనలు :
2
35. వెలిగించవలసిన వత్తులసంఖ్య
:7
36. వెలిగించవలసిన వత్తులు :
జిల్లేడు వత్తులు
37. దీపారాధనకు వాడవలసిన నూనె :
కొబ్బరి నూనె
38. వెలిగించవలసిన ఆవునేతితో
హారతి : పంచహారతి
39. ధరించవలిసిన తోరము :
పసుపురంగు తోరములో పువ్వులు+ఆకులు
40. నుదుటన ధరించవలసినది :
విభూది
41. 108 మార్లు జపించవలసిన మంత్రం
: ఓం గం గణపతయే నమః
42. జపమునకు వాడవలసిన మాల :
రుద్రాక్ష మాల
43. మెడలో ధరించవలసిన మాల :
స్పటిక మాల
44. మెడలో ధరించవలసిన మాలకు
ప్రతిమ : గణపతి
45. చేయవలసిన అభిషేకము :
పంచామృతములతో
46. ఏదిక్కుకు తిరిగి పూజించాలి
: ఉత్తరం
శ్రీ వరసిద్ధి వినాయక పూజా
విధానము
శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ
విఘ్నోపశాస్తయే ||
సముఖశ్చైక దంతశ్చ కపిలో
గజకర్ణకః |
లంబోదరశ్చ వికటోవిఘ్న రాజో
గణాధిపః ||
ధూమకేతుర్గణాధ్యక్షః
ఫాలచంద్రో గజానన |
వక్రతుండ శ్శూర్పకర్ణః
హేరంబః స్కంద పూర్వజ ||
షోడశైతాని నామాని యః పఠేత్శృణుయాదపి
|
విద్యారంభే వివాహే చ
ప్రవేశే నిర్గమేతథా ||
సంగ్రమే సర్వ కార్యేషు
విఘ్నస్తస్య నజాయతే |
అభీప్సితార్ధ సిధ్యర్ధం
పూజితోయస్సురైరపి ||
సర్వవిఘ్నచ్చిదే
తస్మైగణాధిపతయే నమః ||
ఓం కేశవాయ స్వాహా
నారయణాస్వాహా మాధవాయ స్వాహా గోవింద విష్ణో మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషీకేశ
పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ
అచ్చుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః
శో || ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ
సమారభే ||
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం
మహః ఓం జనః ఓంతపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం | భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||
ఓ మాపో జ్యోతీరసోమృతం
బ్రహ్మ భూర్భువస్సువరోమ్
మమోపాత్త దురితక్షయ ద్వారా
శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహా
విష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే
వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంభూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ
దిగ్భాగే శ్రీశెలస్య ఈశాన్య ప్రదేశే ( తాము పూజ చేయు ప్రాంతము ఏ దిక్కు న ఉన్నదో ఆ
దిక్కును చెప్పుకొనవలెను ) కృష్ణా కావేర్యోః మధ్యదేశే స్వగృహే ( అద్దె ఇంటి
యందున్నవారు ' వాసగృహే ' అని చెప్పవలెను) అస్మిన వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన (
స్వభాను ) నామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం
తిథౌ ( ఇందు )వాసరే ( )నక్షత్రే శుభయౌగే శుభకరణే ఏవంగుణ విషేషణ విశిష్టాయాం అస్యాం
శుభ తిధౌ శ్రీ మతః ( గోత్రము చేప్పవలేను ) గోత్రస్య ( పేరు ) నామధేయస్య మమ అస్మాకం
సహకుటుంబానాం క్షేమ స్త్థెర్య విజయ అభయ ఆయురారోగ్య ఏఆశ్వర్యాభివృద్ధ్యర్థం కామ
మౌక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధయర్థం సకల విద్యా ప్రాప్త్యర్ధం సకల సమస్త
దురితోపశాస్త్యర్ధం సమస్త మంగళావాప్యర్ధం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక
దేవతాముద్దిశ్య వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్ధం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి
ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిషే|| (కుడిచేతి ఉంగరపు
వేలిని నీటిలో ముంచవలెను.) తదంగ కలశ పూజాం కరిష్యేః (కుడిచేతి ఉంగరపు వేలిని
నీటిలో ముంచవలెను.)
(కలశమును గంధము, పుష్పములు, అక్షతలతో పూజించి, కలశముపై కుడిచేతిని ఉంచి, ఈ క్రింది విధంగా చెప్పవలెను.)
శ్లో|| కలశస్యముఖే విష్ణుః కఠేరుద్ర సమాశ్రితః |
మూలే తత్ర స్థితో బ్రహ్మ
మధ్యే మాత్సగణాః స్మృతాః ||
కుక్షౌతు సాగరాః సర్వే సప్త
ద్వీపా వసుంధరా |
ఋగ్వేదోథ యజుర్వేద స్సామ
వేదో హ్యధర్వణః ||
అంగైశ్చసహితా స్సర్వే
కలశాంబు సమాశ్రితాః |
అయాంతు దేవాః పూజార్ధం
దురితక్షయకారకాః ||
గంగేచ యమునేచైవ గోదావరి
సరస్వతిః |
నర్మదే సింధు కావేరి
జలేస్మిన్ సన్నిధిం కురు ||
(కలశమునందలి నీటిని తలపై
చల్లుకొని, పూజాద్రవ్యాలపై చల్లవలెను.)
ఆదౌ నిర్విఘ్నేన
పరిసమాప్త్యర్ధం గణపతి పూజాంకరిష్యే (పసుపుతో గణపతిని చేసి తమలపాకుపై నుంచవలెను)
మహా గణాధిపతయే నమః
ధ్యాయామి, ధ్యానం సమర్పయామి (నమస్కరించాలి) ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి (క్రింది భాగమున నీటిని చల్లవలెను)
హస్తయోః అర్ఫ్యం సమర్పయామి
(నీటిని చల్లవలెను) పాదయోః పాద్యం సమర్పయామి (నీటిని చల్లవలెను)
స్నానానంతరం ఆచమనీయం
సమర్పయామి నీటిని చల్లవలెను)
వస్త్రం సమర్పయామి (దూదితో
చేసిన వస్త్రము, లేదా పుష్పము నుంచవలెను)
గంధాన్ ధారయామి (గంధమును
చల్లవలెను)
గంధస్యోపరి అలంకరణార్ధం
అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)
పుష్పైః పూజయామి
(ఈ క్రింది మంత్రములు
చదువుతూ పుష్పములుంచవలెను)
ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ
నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే
నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం
శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః
ఓం మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి (పుష్పములతో పత్రితో అర్చించవలెను)
ధూపం ఆఘ్రాపయామి (అగరుబత్తి
వెలిగించవలెను)
దీపం దర్శయాని (దీపమును
చూపవలెను)
ఓం భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి| ధియోయోనః
ప్రచోదయాత్|| సత్యం స్వర్తేన పరిషించామి,
అమృతమస్తు! అమృతోపస్తరణమసి. ఓప్రాణాయ స్వాహా,
ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా,
ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా, మహాగణాధిపతయేనమః యధాభాగం గుడం నివేదయామి (బెల్లం ముక్కను
నివేదించవలెను) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను) తాంబూలం
సమర్పయామి (తాంబూలం ఉంచవలెను)
ఆచమనీయం సమర్పయామి (నీటిని
చల్లవలెను)
ఆనంద కర్పూర నీరాజనం
దర్శయామి (కర్పూరం వెలిగించాలి)
శ్లో|| వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ |
అవిఘ్నంకురుమే దేవ సర్వ
కార్యేషు సర్వదా ||
మహాగణాధిపతే నమః
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ
ఇష్టకామ్యార్ధ ఫలసిధ్యర్ధం గణాధిపతి ప్రసాదం శిరసాగృష్ణామి (గణపతి వద్ద నుండి
అక్షతలు తీసి తలపై ఉంచుకోవలెను)
వరసిద్ధి వినాయక పూజా
ప్రారంభః
శ్లో|| ఏకదంతం శూర్పకర్ణం గజవక్ర్తం చతుర్భుజం
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్
సిద్ధి వినాయకం ||
శ్రీ వరసిద్ధి వినాయకం
ఆవాహయామి (విగ్రహమునకు క్రింది భాగమున తమలపాకుతో నీటిని చల్లవలెను)
మౌక్తికైః పుష్పరాగైశ్చ
నానా రత్నైర్విరాజితం
అనాధ నాధ సర్వజ్ఞ గీర్వాణ
గణపూజితః గృహోణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ
ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)
దధిక్షీర సమాయుక్తం
మధ్యాజ్యేన సమన్వితం |
శ్రీ వరసిద్ధి వినాయకాయ
మధుపర్కం సమర్పయామి (ఆవుపాలు పెరుగు, నెయ్యిలతో కూడిన
మధుపర్కము నుంచవలెను)
స్నానం పంచామృతైర్దేవ గృహోన
గణనాయక |
శ్రీ వరసిద్ధి వినాయకాయ
పంచామృత స్నానం సమర్పయామి (పంచామృతాలనగా - 1. ఆవుపాలు 2. ఆవుపెరుగు 3. ఆవునెయ్యి 4. తేనే, లేక చెరకు రసము, లేదా పంచదార 5.
ఫలోదకము, లేక పండ్ల రసము - వీటన్నిటితో వేరువేరుగా కాని, ఒకేసారిగా కాని స్నానము చేయించవలెను)
శో|| రక్తవస్త్ర ద్వయం చారు దేవయోగ్యంచ మంగళం |
శ్రీ వరసిద్ధి వినాయకాయ
వస్త్రయుగ్మం సమర్పయామి (ఎర్రని పుష్పము, లేదా ఎర్రని అంచు
గల రెండు వస్త్రములను సమర్పించవలెను)
రాజతం బ్రహ్మసూత్రం చ
కాంచనంచోత్తరీయకం |
శ్రీ వరసిద్ధి వినాయకాయ
యజ్ఞోపవీతం సమర్పయామి (వెండి తీగతో చేసిన యజ్ఞోపవీతము, బంగారు తీగతో చేసిన ఉత్తరీయము సమర్పించవలెను. లేదా రెండు
పుష్పములుంచవలెను)
చందనాగరు కర్పూర కస్తూరీ
కుంకుమాన్వితం |
శ్రీ వరసిద్ధి వినాయకం
గంధాన్ ధారయామి (చందనము పూయాలి)
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్
శాలీయాన్ తండులాన్ శుభాన్
శ్రీ వరసిద్ధి వినాయకాయ
అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)
శ్లో|| సుగందీని చ పుష్పాణి వాతకుంద ముఖానిచ |
అథాంగ పూజా
ఓం ఏకదంతాయ నమః గుల్భౌ
పూజయామి (మడిమలు)
ఓం (మంత్రమును చదువుతూ దాని
కెదురుగా తెల్పిన చోట పూజింపవలెను)
ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి
(పాదములు)
శూర్పకర్ణాయ నమః జానునీ
పూజయామి (మోకాళ్లు)
ఓం విఘ్న రాజాయ నమః జంఘే
పూజయామి (పిక్కలు)
ఓం అఖువాహనాయ నమః ఊరూ
పూజయామి (తొడలు)
ఓం హేరంభాయ నమః కటిం
పూజయామి (పిరుదు)
ఓం లంబోదరాయ నమః ఉదరం
పూజయామి (బొజ్జ)
ఓం గణనాథాయ నమః నాభిం
పూజయామి (బొడ్డు)
ఓం గణేశాయ నమః హృదయం
పూజయామి (రొమ్ము)
ఓం స్థూలకంఠాయ నమః కంఠం
పూజయామి (కంఠం)
ఓం స్కందాగ్రజాయ నమః స్కంథౌ
పూజయామి (భుజములు)
ఓం పాషస్తాయ నమః హస్తౌ
పూజయామి (చేతులు)
ఓం గజ వక్త్రాయ నమః వక్త్రం
పూజయామి (ముఖము)
ఓం విఘ్నహంత్రే నమః నేత్రౌ
పూజయామి (కన్నులు)
ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ
పూజయామి (చెవులు)
ఓం ఫాలచంద్రాయ నమః లలాటం
పూజయామి (నుదురు)
ఓం సర్వేశ్వరాయ నమః (తల)
ఓం విఘ్నరాజాయ నమః
సర్వాణ్యంగాని పూజయామి (శరీరం)
అథ ఏకవింశతి పత్ర పూజా
(21 ఆకులతో పూజ చేయవలెను.
పూజించవలసిన ఆకులు బ్రకెట్లలో తెలియజేయబడునవి)
ఓం గణాధిపాయ నమః బృహతీ
పత్రం పూజయామి (వాకుడాకు)
ఓం ఉమాపుత్రాయ నమః
బిల్వపత్రం పూజయామి (మారేడు)
ఓం గజాననాయ నమః
దూర్వాయుగ్మమ పూజయామి (గరిక)
ఓం హరసూనవే నమః డత్తూర
పత్రం పూజయామి (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయ నమః బదరీపత్రం
పూజయామి (రేగు ఆకు)
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ
పత్రం పూజయామి (ఉత్తరేణి)
ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం
పూజయామి (తులసి దళములు)
ఓం ఏకదంతాయ నమః చూతపత్రం
పూజయామి (మామిడి ఆకు)
ఓం వికటాయ నమః కరవీర పత్రం
పూజయామి (గన్నేరు)
ఓం భిన్నదంతాయ నమః
విష్ణుక్రాంతపత్రం పూజయామి (విష్ణుక్రాంత)
ఓం వటవే నమః దాడిమీ పత్రం
పూజయామి (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు
పత్రం పూజయామి (దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమః మరువక
పత్రం పూజయామి (మరువం)
ఓం హేరంబాయ నమః
సింధువారపత్రం పూజయామి (జాజి ఆకు)
ఓం సురాగ్రజాయ నమః గండకీ
పత్రం పూజయామి (గండకి ఆకు)
ఓం ఇభవక్త్రాయ నమః శమీ
పత్రం పూజయామి (జమ్మి ఆకు)
ఓం వినాయకాయ నమః అశ్వత్థ
పత్రం పూజయామి (రావి ఆకు)
ఓం సురసేవితాయ నమః అర్జున
పత్రం పూజయామి (మద్ది ఆకు)
ఓం కపిలాయ నమః అర్కపత్రం
పూజయామి (జిల్లేడు)
శ్రీ గణేశ్వరాయ నమః
ఏకవింశతి పత్రాణి సమర్పయామి (పూజచేయగా మిగిలిన ఆకులన్నియు
అథాష్టోత్తర శతనామ పూజా
(ప్రతి మంత్రమును చదువుతూ
ఒక్కొక్క పూవు, లేదా అక్షతలు వేయవలెను)
1. ఓం వినాయకాయ నమ: 55.
ఓం గదినే నమ:
2. ఓం విఘ్నురాజాయ నమ: 56.
ఓం చక్రినే నమ:
3. ఓం గౌరీపుత్రాయ నమ: 57.
ఓం ఇక్షుచాపధృతే నమ:
4. ఓం గణేశ్వరాయ నమ: 58.
ఓం శ్రీదాయినే నమ:
5. ఓం స్కందాగ్రజాయ నమ: 59.
ఓం అజాయ నమ:
6. ఓం అవ్యయాయ నమ: 60. ఓం ఉత్పలకరాయ నమ:
7. ఓం పూషాయ నమ: 61. ఓం శ్రీపతయే నమ:
8. ఓం దక్షాయ నమ: 62. ఓం స్తుతిహర్షితాయ నమ:
9. ఓం అధ్యక్షాయ నమ: 63.
ఓం కులాద్రిభేదినే నమ:
10. ఓం ద్విజప్రియాయ నమ: 64.
ఓం జటిలాయ నమ:
11. ఓం అగ్నిగర్భచ్ఛిదే నమ: 65.
ఓం కలికల్మషనాశనాయ నమ:
12. ఓం ఇంద్ర శ్రీప్రదాయ నమ: 66.
ఓం చంద్రచూడామణయే నమ:
13. ఓం వాణీ ప్రదాయ నమ: 67.
ఓం కాంతాయ నమ:
14. ఓం అవ్యయాయ నమ: 68. ఓం పాపహారిణే నమ:
15. ఓం సర్వసిద్ధిప్రదాయ నమ: 69.
ఓం సమాహితాయ నమ:
16. ఓం శర్వతనయాయ నమ: 70.
ఓం ఆశ్రితశ్శ్రీకరాయ నమ:
17. ఓం శర్వరీ ప్రియాయ నమ: 71.
ఓం సౌమ్యాయ నమ:
18. ఓం సర్వాత్మకాయ నమ: 72.
ఓం భక్తవాంఛితదాయకాయ నమ:
19. ఓం సృష్టికర్తాయ నమ: 73.
ఓం శాంతాయ నమ:
20. ఓం దేవానేకార్చితాయ నమ: 74.
ఓం కైవల్యసుఖదాయ నమ:
21. ఓం శివాయ నమ: 75. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమ:
22. ఓం శుద్ధాయ నమ: 76. ఓం జ్ఞానినే నమ:
23. ఓం బుద్ధి ప్రదాయ నమ: 77.
ఓం దయాయుతాయ నమ:
24. ఓం శంతాయ నమ: 78. ఓం దాంతాయ నమ:
25. ఓం బ్రహ్మచారిణే నమ: 79.
ఓం బ్రహ్మణ్యే నమ:
26. ఓం గజాననాయ నమ: 80. ఓం ద్వేషవివర్జితాయ నమ:
27. ఓం ద్వైమాతురాయ నమ: 81.
ఓం ప్రమత్తదైత్యభయదాయ నమ:
28. ఓం మునిస్యుత్త్యాయ నమ: 82.
ఓం శ్రీకంఠాయ నమ:
29. ఓం భక్తవిఘ్నువినాశయ నమ: 83.
ఓం విబుధేశ్వరాయ నమ:
30. ఓం ఏకదంతాయ నమ: 84. ఓం రమార్చితాయ నమ:
31. ఓం చతుర్బాహవే నమ: 85.
ఓం విధినే నమ:
32. ఓం చతురాయ నమ: 86. ఓం నాగరాజయజ్ఞోపవీతినే నమ:
33. ఓం శక్తిసంయుతాయ నమ: 87.
ఓం స్థూలకంఠాయ నమ:
34. ఓం లంబోదరాయ నమ: 88.
ఓం స్వయంకర్తాయ నమ:
35. ఓం శూర్పకర్ణాయ నమ: 89.
ఓం సామ ఘోషప్రియాయ నమ:
36. ఓం హరిర్ర్బహ్మవిదే నమ: 90.
ఓం పరాయ నమ:
37. ఓం ఉత్తమాయ నమ: 91. ఓం స్థూలతుండాయ నమ:
38. ఓం కాలాయ నమ: 92. ఓం అగ్రణినే నమ:
39. ఓం గ్రహపతయే నమ: 93.
ఓం ధీరాయ నమ:
40. ఓం కామినే నమ: 94. ఓం వాగీశాయ నమ:
41. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమ:
95. ఓం సిద్ధిదాయాయ నమ:
42. ఓం పాశాంకుశధరాయ నమ: 96.
ఓం దూర్వాబిల్వప్రియాయ నమ:
43. ఓం చండాయ నమ: 97. ఓం అవ్యక్తమూర్తయే నమ:
44. ఓం గుణాతీతాయ నమ: 98.
ఓం అద్భుతమూర్తయే నమ:
45. ఓం నిరంజనాయ నమ: 99.
ఓం శైలేంద్రతనుజోత్సంగాయ నమ:
46. ఓం అకల్మషాయ నమ: 100.
ఓం ఖేలనోత్సుకమానసాయ నమ:
47. ఓం స్వయంసద్ధాయ నమ: 101.
ఓం స్వలావణ్య సుధాసార జితమన్మథ విగ్రహాయ నమ:
48. ఓం సిద్ధార్చిత పదాంబుజాయ
నమ: 102. ఓం సంస్తజగదాధారాయ నమ:
49. ఓం బీజాపూర ఫలాసక్తాయ నమ: 103.
ఓం మాయావినే నమ:
50. ఓం వరదాయ నమ: 104. ఓం మూషకవాహనాయ నమ:
51. ఓం శాశ్వతాయ నమ: 105.
ఓం హృష్టాయ నమ:
52. ఓం కృతినే నమ: 106. ఓం తుష్టాయ నమ:
53. ఓం ద్విజప్రియాయ నమ: 107.
ఓం ప్రసన్నాత్మనే నమ:
54. ఓం వీతభయాయ నమ: 108.
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమ:
శ్లో || దశాంజ్గం గుగ్గులోపేతం సుగన్ధిం సుమనోహరం |
(దశాంజ్గము, గుగ్గులము నిప్పులపై వేసి పొగ చూపవలెను. లేదా, అగరువత్తి వెలిగించవలెను)
శ్లో || సాజ్యం త్రివర్తి సమ్యుక్తం వహ్నినా ద్యోతితం మయా |
శ్లో || సుగంధాన్ సుకృతాన్ చైవ మోదకాన్ ఘృతపాచితాన్ |
శ్లో || భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోప్యం పానీయమేవచ |
ఇదం గృహాణ నైవేద్యం
మయాదత్తం వినాయక ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ
మహానైవేద్యం సమర్పయామి (పిండి వంటలు మొదలైన వానితో కూడిన మహా నివేదన చేయవలెను)
శ్లో || పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం |
కర్పూర చూర్ణ సమ్యుక్తం
తాంబూరం ప్రతిగృహ్యతాం ||
శ్రీ వరసిద్ధి వినాయక
స్వామినే నమః తాంబూలం సమర్పయామి (వక్క, పచ్చకర్పూరము ఉంచి
తాంబూలం సమర్పించవలెను)
శ్లో|| సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ |
శ్రీ వరసిద్ధి వినాయకాయ
సువర్ణ పుష్పం సమర్పయామి (పుష్పములు సమర్పించవలెను.)
శ్లో || ఘృతవర్తిసహస్త్రైశ్చ కర్పూర శకలైస్తథా |
శ్రీ వరసిద్ధి వినాయకాయ
నీరాజనం దర్శయామి (కర్పూరము వెలిగించవలెను) నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి
(నీటిని సమర్పించవలెను)
(ఒక్కొక్క మంత్రమునకు
ఒక్కొక్క జత గరిక వేయవలెను)
ఓం గణాధిపాయ నమః
దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమః
దూర్వాయుగ్మం పూజయామి
ఓం లఖు వాహనాయ నమః
దూర్వాయుగ్మం పూజయామి
ఓం వినాయకాయ నమః
దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఈశపుత్రాయ నమః
దూర్వాయుగ్మం పూజయామి
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఏకదంతాయ నమః
దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఇభవక్త్రాయ నమః
దూర్వాయుగ్మం పూజయామి
ఓం మూషిక వాహనాయ నమః
దూర్వాయుగ్మం పూజయామి
ఓం కుమార గురవే నమః
దూర్వాయుగ్మం పూజయామి
(దోసలియందు పుష్పమునుంచుకొని
క్రింది మంత్రమును చెప్పాలి)
శ్లో|| గణాధిప నమస్త్రేస్తు ఉమాపుత్రాఘనాశన
వినాయకేశతనయ సర్వసిద్ధి ప్రదాయక |
ఏకదంతైక వదన తథా మూషిక వాహన
కుమార గురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః మంత్రపుష్పం
సమర్పయామి (పుష్పములను ఉంచవలెను)
శ్లో || ప్రదిక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ |
నమస్తే విఘ్నరాజాయ నమస్త్రే విఘ్న నాశన ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఆత్మ ప్రదక్షిణ
నమస్కారాన్ సమర్పయామి (ఆత్మ ప్రదక్షిణ చేయవలెను)
శ్లో || ఆర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక |
గందపుష్పాక్షతైర్ముక్తం పాత్రస్థం పాపనాశన ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ పునరర్ఘ్యం
సమర్పయామి (పై శ్లోకము చెప్పుచూ 3 మారులు నీటిని విడువవలెను)
శ్లో || వినాయక నమస్తుభ్యం సతతం - మోదకప్రియ |
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు
సర్వదా || (గణపతికి నమస్కరించవలెను)
(వాయన దానము)
శ్లో || గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వై దదాతి చ |
గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమో నమః ||
(ఈ శ్లోకము వాయన మిచ్చువారు చెప్పవలెను)
మంత్రము-
దేవస్యత్వాసవితుః
ప్రసవేశ్వినోర్భాహుభ్యాం పూష్ణోహస్తాభ్యామా దదే
(ఈ మంత్రము వాయనము
పుచ్చుకొనువారు చెప్పవలెను)
(పూజచేసినవారు ఈ క్రింది
శ్లోకములను చెప్పుచూ ఆత్మ ప్రదక్షిణ నమస్కారములను చేయవలెను)
శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ |
తానితాని ప్రనశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
శ్లో || పాపోహం పాప కర్మాణాం పాపాత్మా పాప సంభవః |
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల ||
శ్లో || అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష వినాయక ||
ప్రార్ధన
ఉ|| తొండము నేకదంతమును దోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు
మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల
నొజ్జయై
యుండెడి పార్వతీతనయ యోయి గణాధిప నీకు
మ్రొక్కెదన్ ||
చ|| తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య నిను ప్రార్ధన చేసెద నేకదంత
మా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు
బాయకుండు మీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప! లోకనాయకా!
క || తలచితినే గణనాధుని తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా
దలచితినే హేరంబుని దలచిన నా విఘ్నములను
తొలగుట కొఱకున్
క || అటుకులు కొబ్బరి పలుకులు చిట్టిబెల్లము నానుబ్రాలు
చెరకురసంబున్
నిటలాక్షు నగ్రసుతునకు పటుతరముగ విందుచేతు
ప్రార్ధింతు మదిన్
వినాయకుని దండకము
శ్రీ పార్వతీపుత్ర
లెకత్రయీస్తోత్ర, సత్పుణ్యచార్తిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీ నాథ సంజాత స్వామీ శివాసిద్ధివిఘ్నేశ, నీ పాద పద్మంబులన్, నీదు కంఠంబు నీ
బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులు న్నీకరాళంబు నీ పెద్ద
వక్త్రంబు దంతంబు నీ పాద హస్తంబు లంబోదరంబున్ సదామూషికాశ్వంబు మందహాసంబు నీ చిన్న
తొండంబు నీ గుజ్జు రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్
గుంకుమం బఖతల్జాజులున్ పంకజంబుల్ తగన్ మల్లెలున్నొల్లలున్మంచి చేమంతులున్
దెల్లగన్నేరులున్ మకెలన్ పొన్నలున్ పువ్వులున్మంచి దూర్వంబులుందెచ్చి శాస్త్రోక్త
రీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయ పొన్నంటిపండ్లున్
మరిన్మంచివౌ నిఖుఖండంబులు న్రేగుబం డ్లప్పడంబుల్ వడల్ నేతి బూరెల్ మరిన్
గోధుమప్పంబులున్ పుంగులు న్బూరెలు న్గారెలున్ చొక్కమౌ చల్మిడిని బెల్లమున్ తేనెయుం
జున్నుబాలాజ్యము న్నానుబియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్ బంగరుం బళ్ళె ముందుంచి
నైవేద్యముం బంచనీరాజనంబున్ నమస్కారముల్చేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే
యన్యదైవంబులం బ్రార్ధనల్ సేయుటల్ కాంచనంబొల్లకే ఇన్ముదా గోరు చందంబుగాదే మహాదేవ
యోభక్తమందార యో సుందరాకారా యో భాగ్యగంభీర యో దేవచూడామణి లోకరక్షామణి బంధుచింతామణీ
స్వామి నిన్నెంచ నేనెంత నీ దాసదాసాను దాసుండ శ్రీ దాంతరాజాన్వవాయుండ రామాభి దాసుండ
నన్నైప్డు చేబట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగాచూచి హృత్వద్మ సింహాసనారూఢత న్నిల్చి
కాపాడుతేకాదు నింగొల్చి ప్రార్ధించు భక్తాళికిన్ కొంగుబంగారమై కంటికిన్ ఱెప్పవై
బుద్ధియు న్విద్యయు న్పాడియున్ పంటయున్ బుత్రపౌత్రాది వృద్ధిన్ దగన్కల్గగాజేసి
పోషింపుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మాయివే వందనంబుల్ శ్రీగణేశా నమస్తే నమస్తే
నమస్తే నమః
విఘ్నేశ్వరుని మంగళహారతులు
శ్రీ శంభుతనయునకు
సిద్దిగణనాధునకు వాసిగల దేవతావంద్యునకును అపరసవిద్యలకు అది గురువైనట్టి భూసురోత్తమ
లోక పూజ్యునకును జయమంగళం || నేరేడు మారేడు నెలవంకమామిడి
దూర్వారచెంగల్వ ఉత్తరేణు | వేఱువేఱుగదెచ్చి వేడ్కతో
పూజింతు పర్వమున దేవగణపతికి నిపుడు ||జయ|| సురు చిరముగ భాద్రపద శుద్ధ చవితియందు పొసగ సజ్జనులచే పూజ
గొల్తు | శశిచూడరాకున్న జేకొంటి నొక
వ్రతము పర్వమున దేవ గణపతికి నిపుడు ||జయ|| పానకము వడపప్పు పనస మామిడిపండ్లు దానిమ్మ ఖర్జూర
ద్రాక్షపండ్లు | తేనెతో మాగిన
తియ్యమామిడిపండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు ||జయ|| ఓబొజ్జ గణపయ్య నీబంటు
నేనయ్య ఉండ్రాళ్ళమీదికి దండుపంపు కమ్మని నెయ్యియు కడుముద్దపప్పును బొజ్జ విరుగగ
దినుచు పొరలుకొనుచు ||జయ|| వెండి పళ్ళెరములో వెయివేల ముత్యాలు కొండలుగ నెలములు
కలియబోసి, మెండుగను హారములు మెడనిండ
వేసికొని దండిగా నీకిత్తు ధవళారతి ||జయ|| పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు
కస్తూరినీ ఎప్పుడూ నినిగొల్తు ఏకచిత్తంబున పర్వమున దేవగణపతికి నిపుడు ||జయ|| ఏకదంతంబును ఎల్ల గజ వనంబు
బాగయిన తొండంబు వలపు కడుపు, జోకయిన మూషికముజోకయిన
మూషికము సొరిది నెక్కాడుచును భవ్యుడగు దేవగణపతికి నిపుడు ||జయ|| మంగళము మార్తాండ తేజునకు
మంగళము సర్వజ్ఞనందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవగణపతికి నిపుడు ||జయ|| సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా
పూజింతు ఒనరంగ నిరువది యొక్క ప్రతి దానిమ్మ మరువమ్ము విష్ణుక్రాంత యుమ్మెత్త
దుర్వార యుత్తరేణి కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు
జాజీబలురక్కసి జమ్మి దాసనిపువ్వు గరిక మాచిపత్రి మంచి మొలక అగరు గంధాక్షత ధూప దీప
నైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబ్రాలు
ఉండ్రాళ్లు పప్పు పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరి పూజింతు నిన్నైపుడు
కోర్కెలలర ||జయ|| బంగురుచెంబుతో గంగోదకము తెచ్చి సంగతిగ శివునకు జలకమార్చి,
మల్లెపువ్వుదెచ్చి మురహరుని పూజింతు నిన్నైపుడు
కోర్కెలలర ||జయ|| బంగురుచెంబుతో గంగోదకము తెచ్చి సంగతిగ శివునకు జలకమార్చి,
మల్లెపువ్వుదెచ్చి మురహరుని పూజింతు రంగైన నా
ప్రాణలింగమునకు ||జయ|| పట్టుచీరలు మంచి పాడిపంటలుగల్గి ఘనముగా కనకములు కరులు హరులు
యిష్టసంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ||జయ|| ముక్కంటి తనయుడని ముదముతో
నేనును చక్కనైన వస్తుసమితిగూర్చి నిక్కముగ మనమును నీయందె నేనిల్చి ఎక్కుడగు పూజ
లాలింపజేతు ||జయ|| మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైనా గంధసారములను
ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ||జయ|| దేవాది దేవునకు
దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు
భవ్యుడగు దేవగణపతికి నిపుడు ||జయ|| చెంగల్వ చేమంతి చేలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను
పుష్పజాతులు తెచ్చి పూజింతు, నేనెపుడు బహుబుద్ధి గణపతికి
బాగుగాను ||జయ|| మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు |
నేరేడు నెలవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు
చనువుతోను ||జయ|| ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి మమ్మేలు మీ కరుణతోను
మాసాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందుము కోర్కెదీర ||జయ||
విఘ్నేశ్వరుని కథా
ప్రారంభము
సూతమహాముని శౌనకాది మునులకు
విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును
తన్నివారణమును చెప్పదొడంగెను.
పూర్వము గజ రూపముగల
రాక్షసేశ్వరుండు శివునిగూర్చి ఘోర తపంబొనర్చెను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు
ప్రత్యక్షమే వరంబుకోరుకోమనెను. అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీ వెల్లప్పుడు నా యుదరమందే వసించియుండుమని కోరెను.
భక్తసులభుండగు నా పరమేశ్వరుండాతని కోర్కెదీర్చ గజాసురుని యుదరమందు ప్రవేశించి
సుఖంబున నుండెను.
కైలాసమున పార్వతీదేవి భర్త
జాడ తెలియక పలుతెరంగుల నన్వేషించుచు కొంత కాలమునకు గజాసుర గర్భస్థుడగుట తెలిసికొని
రప్పించుకొను మార్గము గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్ధించి తన పతి
వృత్తంతము తెలిపి, 'మహాత్మా! నీవు పూర్వము
భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి. ఇప్పుడుకూడ
నుపాయాంతరముచే నా పతిని రక్షింపుము ' అని విలపింప,
శ్రీహరియా పార్వతి నూరడించి పంపె. అంత నా హరి
బ్రహ్మాది దేవతలను పిలిపించి, గజాసుర సంహారమునకు
గంగిరెద్దు మేళమే యుక్తమని నిశ్చయించి, నందిని
గంగిరెద్దుగా నలంకరించి, బ్రహ్మాది దేవతల చేతను
తలకొక వాద్యమును ధరింపజేసి, తానును చిరుగంటలు, సన్నాయిలు దాల్చి గజాసుర పురంబు జొచ్చి జగన్మోహనంబుగా
నాడించుచుండగా, గజాసురుండు విని, వారలను తన చెంతకు పిలిపించి తన భవనమందు నాడింప నియోగించెను.
బ్రహ్మాది దేవతలు వాద్య విషేషంబుల బొరు సలుప జగన్నాటక సూత్రధారియగు నా హరి చిత్ర
విచిత్ర కరంబుగ గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు
పరమానందభరితుడై 'మీకేమి కావలయునో
కోరుడొసంగెద ' ననిన, హరి వానిని సమీపించి, 'ఇది శివుని వాహనమును నంది ', శివుని కనుగొనుటకై వచ్చే. కావున శివునొసంగు ' మనెను. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా నెరింగి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని 'నా శిరస్సుత్రిలోక పూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు 'మని ప్రార్ధించి విష్ణుమూర్తికి అంగీకారము దెలుప నాతడు
నందిని ప్రేరేపించెను. నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించెను. అంత
శివుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా హరి 'దుష్టాత్ముల కిట్టి వరంబు లీయరాదు. ఇచ్చినచో పామునకు పాలు
పోసి నట్లగు ' నని ఉపదేశించి బ్రహ్మాది
దేవతలను వీడ్కొలిపి తాము వైకుంఠమున కేగెను. శివుడు నంది నెక్కికైలాసంబున
కతివేగంబున జనియె.
వినాయకోత్పత్తి
కైలాసంబున పార్వతీదేవి భర్త
రాకను దేవాదుల వలన విని ముదమంది అభ్యంగన స్నానమాచరించును నలుగుబిండి నొక బాలునిగ
జేసి, ప్రాణం బొసగి, వాకిలి ద్వారమున కాపుగా ఉంచెను. స్నానానంతరము పార్వతి
సర్వాభరణముల నలంకరించుకొనుచు పత్యాగమనమును నిరీక్షించుచుండె. అపుడు పరమేశ్వరుడు నందినారోహించి
వచ్చి లోపలికి పోబోవ వాకిలి ద్వారముననున్న బాలుడడ్డగించెను. శివుడు కోపించి
త్రిశూలముతో బాలుని కంఠంబు దునిమిలోని కేగెను.
అంత పార్వతీదేవి భర్తంగాంచి,
ఎదురేగి, అర్ఘ్య పాద్యాదులచే పూజించె. వా రిరువురును పరమానందమున
ప్రియభాషణములు ముచ్చటించుచుండు తానొనరించిన పనికి చింతించి, తాను తెచ్చిన గజాసుర శిరంబు నా బాలుని కతికించి ప్రాణంబు
నొసంగి 'గజాననుడు ' అని నామం బొసగె. అతనిని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరులు
పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమ భక్తితో సేవించుచుండెను. ఇతడు
సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనముగా జేసికొనియెను.
కొంతకాలమునకు పార్వతీ
పరమేశ్వరులకు కుమారస్వామి జనియించెను. అతడు మహా బలశాలి. అతని వాహనరాజము నెమలి.
అతడు దేవతల సేనా నాయకుడై ప్రఖ్యాతిగాంచియుండెను.
ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని సేవించుచు విఘ్నముల కొక్కని అధిపతిగా తమ
కొసంగుమని కోరిరి. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆ యాధిపత్యము తన కొసంగుమనియు,
'గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్ధుడు గనుక
ఇయ్యాధిపత్యము తన కొసంగు 'మని కుమారస్వామియు తండ్రిని
వేడుకొనిరి.
శివుడక్కుమారులను జూచి,
'మీలో నెవ్వరు ముల్లోకములందలి పుణ్య నదులలో
స్నానమాడి ముందుగా నా యొద్దకు వచ్చెదరో, వారికీ యాధిపత్యం
బొసంగుదు 'నని మహేశ్వరుండు పలుక,
వల్లె యని సమ్మతించి కుమారస్వామి నెమలి వాహహనంబు
నెక్కి వాయు వెగంబున నేగె. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి, ప్రణమిల్లి 'అయ్యా! నా అసమర్ధత తామెరింగియు నిట్లానతీయదగునే! మీ పాద
సేవకుడను. నా యందు కటాక్ష ముంచి తగునుపాయంబు దెల్పి రక్షింపవే ' యని ప్రార్ధింప, మహేశ్వరుడు దయాళుడై,
'సకృత్ నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్ప శతత్రయం
గంగాది సర్వ తీర్దేషు స్నాతో భవతి పుత్రక ' - కుమారా! ఒకసారి 'నారాయణ మంత్రంబు
పటించు ' మనగా, గజాననుడు సంతసించి, అత్యంతభక్తితో
నమ్మంత్రంబు జపించుచు కైలాసంబున నుండె.
అమ్మంత్ర ప్రభావంబున అంతకు
పూర్వము గంగానదికి స్నానమాడ నేగిన కుమారస్వామికి గజాననుండా నదిలో స్నానమాడి తన
కెదురుగా వచ్చుచున్నట్లు గాంపింగ, నతండును మూడుకోట్ల ఏబదిలక్షల
నదులలోకూడ అటులనే చూచి ఆశ్చర్యపడుచు, కైలాసంబున కేగి
తండ్రి సమీపమందున్న గజాననుని గాంచి, నమస్కరించి,
తన బలమును నిందించుకుని, 'తండ్రీ! అన్నగారి మహిమ తెలియక నట్లంటిని, క్షమింపుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే యొసంగు ' మని ప్రార్ధించెను.
అంత నప్పరమేశ్వరునిచే భాద్రపద
శుద్ధ చతుర్ధినాడు గజాననునికి విఘ్నాధిపత్యం బొసంగబడియె. ఆనాడు సర్వ దేశస్థులు
విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, అపూపములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి
సమర్పించి పూజింప, విఘ్నేశ్వరుండు సంతుష్టుడై కుడుములు
మున్నగునవి భక్షించియు, కొన్ని వాహనమున కొసంగియు,
కొన్ని చేత ధరించియు మంద గమనంబున సూర్యాస్తమయ
వేళకు కైలాసంబున కరిగి తల్లిదండ్రులకు ప్రణామంబు సేయబోవ ఉదరము భూమికానిన చేతులు
భూమి కందవయ్యె. బలవంతంబుగ చేతు లాలిన చరణంబు లాకాశంబు జూచె. ఇట్లు దండ ప్రణామంబు సేయ
గడు శ్రమనొందు చుండ, శివుని శిరంబున వెలయు
చంద్రుడు జూచి వికటంబుగ నవ్వె, అంత రాజ దృష్టి సోకి రాలు
కుడ నుగ్గగునను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి, అందున్న కుడుములు తత్ర్పదేశం బెల్లడల దొర్లెను. అతండును
మృతుండయ్యె. పార్వతి శోకించుచు చంద్రుని జూచి, 'పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను గాన,
నిన్ను జూచిన వారు పాపాత్ములై నీలాపనిందల
నొందుదురుగాక ' అని శపించెను.
ఆ సమయంబున సప్త మహర్షులు
యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూచి
మోహించి, శాప భయంబున అశక్తుడై
క్షీణించుచుండగా, నయ్యది అగ్ని భార్య యగు
స్వాహాదేవి గ్రహించి, అరుంధతీ రూపము దక్క తక్కిన
ఋషిపత్నుల రూపంబు తానే దాల్చి పతికి ప్రియంబు చేసె. ఋషు లద్దానింగనుగొని
అగ్నిదేవునితోనున్న వారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతీ
శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వారి కట్టి నీలాప నింద కలిగినది.
దేవతలును, మునులును ఋషిపత్నుల యాపద పరమేష్ఠికి దెల్ప నాతండు
సర్వజ్ఞుండగుటచే అగ్నిహొత్రుని భార్యయే ఋషి పత్నుల రూపంబు దాల్చి వచ్చుటం దెల్పి
సప్తఋషులను సమాధానపరచె. వారితో కూడ బ్రహ్మకైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని
బ్రతికించి ముదంబు గూర్చె.
అంత దేవాదులు, 'ఓ పార్వతీ దేవీ! నీ శాపంబున లోకంబులకేల్ల కీడు
వాటిల్లుచున్నది. దాని నుపసంహరింపు 'మని ప్రార్ధింప,
పార్వతి సంతసించి, 'ఏ దినంబున ' విఘ్నేశ్వరుని చూచి
చంద్రుడు నవ్వెనో నా దినంబున చంద్రుని జూడరాదాని శాపావ కాశంబు నొసగె అంత
బ్రహ్మాదులు సంతసించి తమ గృహంబుల కేగి, భాద్ర పద శుద్ధ
చతుర్ధి యందు మాత్రము చంద్రుని జూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి.
ద్వాపరయుగంబున
ద్వారకావాసియగు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి, స్తుతించి ప్రియసంభాషణములు జరుపుచు, 'స్వామీ! సాయంసమయమయ్యె. ఈనాడు వినాయక చతుర్ధి. పార్వతీదేవి
శాపంబుచే చంద్రుని జూడరాదు గాన నిజ గృహంబున కేగెద శెలవిండు!' అని పూర్వ వృత్తంత మంతయు శ్రీకృష్ణునికి తెల్పి, నారదుడు స్వర్గలోకమున కేగెను.
అంత శ్రీకృష్ణుడు ఆనాటి
రాత్రి చంద్రుని నెవ్వరూ చూడరాదని పురంబున చాటింపించెను. నాటి రాత్రి శ్రీకృష్ణుడు
క్షీర ప్రియుండుగాన, తాను మింటివంక చూడక
గోష్టమునకు బోయి పాలు పితుకుచు, పాలలో చంద్రుని
ప్రతిబింబమును జూచి, 'ఆహా! ఇక నా కెట్టి యపనింద
రానున్నదో' యని సంశయమున నుండెను.
కొన్నాళ్లకు సత్రాజిత్తను రాజు సూర్య వరముచే శమంతక మణిని సంపాదించి, ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణదర్శనార్ధమై వచ్చెను.
శ్రీకృష్ణుడాతనిని మర్యాద చేసి, 'ఆ మణిని మన రాజునకి '
మ్మనెను. అత 'డది ఎనిమిది బారువుల బంగారము దినంబున కొసగునట్టిది. ఇట్టి
మణిని ఏ మందమతియైన నివ్వ 'డనిన, పోనిమ్మని శ్రీకృష్ణుదూరకొనెను.
అంత నొకనాడు సత్తాజిత్తు
తమ్ముడు ప్రసేను డా మణిని కంఠమున ధరించి వేటాడ నడవికి జనిన నొక సింహ మా మణిని
మాంసఖండ మని భ్రమించి, వాని జంపి ఆ మణిని గొని
పోవుచుండగా, నొక భల్లూక మా సింగమును
దునిమి యా మణిని గొని తమ కుమార్తె కాటవస్తువుగ నొపంగెను. మఱునాడు సత్రాజిత్తు
తమ్ముని మృతి నాలించి, 'కృష్ణుడు మణి ఇవ్వలేదని నా
సోదరుని జంపి, రత్నమపహరించె, నని నగరము చాటె. శ్రీకృష్ణుడది విని నాడు క్షీరమున
చంద్రబింబమును జూచిన దోష ఫలంబని ఎంచి దాని బాపుకొన బంధుసమేతుండై యరణ్యమునకు బోయి
వెదకగా, నొక్క చోట ప్రసేన
కళేబరంబును, సింగపు కాలి జాడలును పిదప
భల్లూక చరణ విన్యాసంబును గాంపించెను.
ఆ దారి పట్టి బోవుచుండ నొక
పర్వత గుహ ద్వారంబు జూసి, పరివారము నచట విడిచి
కృష్ణుండు గుహ లోపలి కేగి అచట బాలిక ఉయ్యాలపై కట్టబడి యున్న మణిని జూచి
అచ్చటికిబోయి, ఆ మణి చేతపుచ్చుకుని
వచ్చుచున్నంట ఉయ్యాలలోని బాలిక యేడ్వదొడంగెను. అంత దాదియును వింత మానిసి
వచ్చేననుచు కేకలు వేసెను.
అంతట జాంబవంతుడు
రోషావేశుండై చనుదెంచి శ్రీకృష్ణునిపై బడి అరచుచు, నఖంబుల గ్రుచ్చుచు, కోరల గొఱకుచు,
ఘోరముగా యుద్ధము చేయ శ్రీకృష్ణుడు వానింబడద్రోసి,
వృక్షముల చేతను రాళ్ల చేతను, తుదకు ముష్టిఘాతముల చేతను రాత్రింబవళ్లు ఎడతెగక
ఇరువదెనిమిది దినంబుల యుద్ధ మొనర్పజాంబవంతుడు క్షీణబలుండై దేహం బెల్ల నొచ్చి భీతి
జెందుచు తన బలంబును హరింపజేసిన పురుషుండు రావణ సంహారి యగు శ్రీరామచంద్రునిగా తలంచి,
అంజలి ఘటించి, 'దేవాది దేవా! ఆర్తజన పోషా! భక్తజన రక్షా! నిన్ను
శ్రీరామచంద్రునిగా నెఱింగితి. ఆ కాలంబున నా యందలి వాత్సల్యముచే నన్ను వరంబు
కొరుమని ఆజ్ఞనయెసంగ నా బుద్ధిమాంద్యంబున మీతో ద్వంద్వ యుద్ధంబు చేయవలెనని కోరు
కొంటిని. కాలాంతరమున నది జరుగగలదని సెలవిచ్చితురి.
ఇప్పుడు నా కోరిక
నెరవేర్చితిరి. నాశరీరమంతయు శిథిలమయ్యెను. ప్రాణములు కడబట్టె, జీవితేచ్చ నశించె. నా అపరాధములు క్షమించి కాపాడుమని
ప్రార్ధింప, శ్రీకృష్ణుడు దయాళుడై,
జాంబవంతుని శరీర మంతయు తన హస్తంబున నిమిరి భయంబు
బాపి, 'భల్లూకేశ్వరా! శమంతకమణి
నపహరించినట్లు నాపై నారోపించిన అపనింద బాపుగొన నిటువచ్చితిని గాన మణి నొసంగుము. నే
నెగెదా ననిన జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణిసహితముగా తమ కుమార్తెయగు జాంబవతిని
కానుకగా నొసంగెను. అంత తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యముల కానందంబు
కలిగించి, కన్యారత్నముతోను, మణితోను శ్రీకృష్ణుడు పురంబుచేరి సత్రాజిత్తును రావించి,
పిన్న పెద్దలను జేర్చి యావ ద్వఋత్తంతమును చెప్పి
శమంతకమణి నొసంగిన నా సత్రాజిత్తు 'అయ్యో! లేనిపోని నింద మోపి
దోషంబునకు పాల్పడితి ' నని విచారించి మణిసహహితముగా
తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి, తప్పు క్షమింపు మని
వేడుకొనెను. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని మరల నొసంగెను. శ్రీకృష్ణుడు
శుభముహూర్తమున జాంబవతీ సత్యభామలను పరిణయంబాడ నచటికి వచ్చిన దేవాదులు, మునులు స్తుతించి, 'మీరు సమర్ధులు గనుక
నీలాపనింద బాపుకొంటిరి. మాకేమి గతి 'యని ప్రార్ధింప
శ్రీకృష్ణుడు దయాళుడై, 'భాద్రపద శుద్ధ చతుర్ధిని
ప్రమాదంబున చంద్రదర్శ మయ్యెనేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి, ఈ శమంతక మణి కథను విని అక్షంతలు శిరంబున దాల్చువారు
నీలాపనింద నొందకుండెదరు గాక! అని ఆనతీయ, దేవాదులు సంతసించి
తమ నివాసంబుల కరిగిరి. ఇట్లు సూత మునీంద్రుడు గణాధిపతి శాపమోక్ష ప్రకారంబు శౌనకాది
మునులకు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమంబున కరిగెను.
నిమజ్జనం చేసే విధానం
దసరా పండుగలా వినాయకచవితికి
కూడా నవరాత్రులు నిర్వహించడం సంప్రదాయం. తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహించి,
ఆ తర్వాత దేవాతా మూర్తులను నిమజ్జనం చేయడం
అనాదిగా వస్తున్నది. నిమజ్జనాన్ని పండుగ రోజుగానీ, లేదా 3, 5, 7, 9వ రోజు గానీ
నిర్వహించాలి. అంటే బేసి సంఖ్య విన్న ఏ రోజైనా స్వామిని నిమజ్జనం చేయవచు. నిమజ్జనం
చేసే ముందు గణపతికి భక్తితో ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. తీర్ధ ప్రసాదాలను
అందరూభుజించి ఆ తరువాత సంప్రదాయబద్ధంగా నిమజ్జనం ఊరేగింపు నిర్వహించాలి.
గణనాధుడిని నీటిలోకి విడిచే ముందు "శ్రీ గణేశం ఉద్వాసయామి.....శోభనార్ధం
పునరాగమనాయచ"అని పఠించడం సంప్రదాయం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
















