ఋణానుబందం
ఒక ఊరిలో రంగయ్య, రంగమ్మ అనే ఇద్దరు
భార్యాభర్తలు ఉండేవారు. ఇద్దరికీ పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఊరిలో ఏమైనా
తగవులు వస్తే వీరే తీర్చేవారు. రంగయ్య ఒక కోడిపుంజుని పిస్తా, బాదం పప్పు పెట్టి
పెంచేవాడు. భార్య చెప్పినా వినేవాడు కాదు. ఒక రోజు ఇంట్లోకి పిల్లి
వచ్చింది. దానిని కూడా చేరదీసి పెంచారు. ఐతే ఈకోడిని ఎలాగైనా సేమ్య ఉప్మా లాగా
లాగించేయాలని పిల్లి ఎదురుచూస్తూ వుండేది. ఈవిషయం గమనించి రంగయ్యని భార్య
హెచ్చరించింది. వినలేదు.
ఒకరోజు పిచ్చుక ఒకటి అక్కడికి వచ్చి మేత తింటుంటే పిల్లి
మీదపడి కొరికింది. పిచ్చుక చచ్చిపోయింది. రంగయ్య చూసి తీసి అవతల పడేశాడు. భార్య
బెంగ పెట్టుకుని కూర్చుంది. ఎందుకే అలా కూర్చున్నావు. ఏమైంది. అంటే ఆపిచ్చుకకి నేను రోజు ధాన్యం వేసి
పెంచుకుంటున్నాను. దాన్ని ఈ పనికిమాలిన పిల్లి కొరికి చంపింది అన్నది.

ఇక చుడండి ఒకటే ఏడుపు. నాకోడి, దానికి పెట్టాను
జీడిపప్పు పకోడీ. ఆపిల్లి కోరికేసింది బోడి. అయ్యో అయ్యో కుయ్యో మొర్రో అంటూ
దీర్గాలు తీస్తుంటే లోపల ఎక్కడో ఉన్న భార్య విని ఏమి జరిగింది ఆ దీర్గాలు ఏంటి?
అనుకుంటూ అక్కడికి వచ్చింది. రంగయ్య ఏడుస్తూ
చూడవే! నాకోడిని ఆదిక్కుమాలిన పిల్లి చంపేసింది. రంగమ్మ నవ్వి! పోనివ్వండి.
ఇప్పుడెందుకు ఏడుస్తున్నారు. నిన్న పిచ్చుక చచ్చిపోతే ఎడవలేదే? రంగయ్య! ఆపిచ్చిక నాదా! అందుకే ఏడవలేదు. ఈకోడికి రోజు
పప్పులు పెట్టి ప్రేమగా పెంచుకున్నాను.
అనగానే రంగమ్మ పగలబడి నవ్వి!
మమ.. ఇది నాది అనుకుంటే ఏడుపే! నమమ. ఇది నాది కాదు అనుకుంటే
లోకమంతా కొత్తగా ఉంటుంది. కష్టం, సుఖం తో సంభందం లేకుండా
జీవితం హాయిగా సాగుతుంది. మీరు చెప్పినట్టు ఎవరూ శాశ్వతం కాదు. ఇది ఆచరణలో ఉండాలి.
మాటలదగ్గరే ఆగిపోవడం వలనే ఈ ఏడుపు వస్తుంది. కాబట్టి నుండి దేనిమీద అతిగా ప్రేమని
పెంచుకోవద్దు. మనం దేన్నైనా పెంచుతున్నాం, ఏదైనా పెడుతున్నాం
అంటే అది ఋణం, ఋణానుబందం మాత్రమే. ఇదే
జీవిత సత్యం. జీవిత పరమార్ధం. అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది.