నామము గొప్పదా - రూపం గొప్పదా
రూపం
నామమునకు ఆధీనం. నామం లేక రూపం
యొక్క జ్ఞానం కలుగదు. రూపంగల పదార్ధం చేతిలో వున్నను నామం తెలుసుకొనని యెడల
ఆ పదార్ధం గుర్తెరుంగం. నామమును ధ్యానిస్తే రూపం స్వయముగా హృదయంలో
వ్యక్తమగును. మనస్సునకు ఆనందం కలుగును. సగుణ,
నిర్గుణ బ్రహ్మములకు నామమే సాక్షి. ఈ
రెండింటిని తెలుసుకొనుటకు నామమే ప్రధానము.వానిని
చేరుటకు నామం మార్గం చూపును.

ఆ కారణంచే ఆ
బ్రహ్మం రూపమును ధరించి పేరు పెట్టుకొని లోకమునకు
వ్యక్తమగుచున్నాడు. ఆ సగుణబ్రహ్మమునకు నామం
లేనిచో స్మరించలేముకాబట్టి సగుణనిర్గుణబ్రహ్మములకంటే నామం యొక్క ప్రభావము
శ్రేష్టమైయున్నది. సగుణబ్రహ్మం మాధుర్యమూర్తి, నామం మాధుర్య మహిమాశక్తి
దీప్తి. రాముని వలన తరించినవారు కొందరే,
రామనామం వలన తరించువారు అనంతమంది.
రామనామ్
మణిదీప్ ధయ జొహ్ రే
హరంద్వార్
తులసి
భీతర్ ఛాహే రహు జాం
బహం ఉజ ఆర్ (తులసీదాసు)
(నీకు లోపల
బయట వెలుగు కావాలని కోరుకుంటే, జిహ్వ అనే ద్వారం
దగ్గర రామనామం అనే దీపాన్ని వెలిగించండి)
రామాయ
రామభద్రాయ రామచంద్రాయ వేధసే / రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే
నమః //
శ్రీరామున్ని
కౌసల్యాదేవి రామా అనియు, దశరధుడు
రామభద్ర యనియు, వసిష్టమహర్షి రామచంద్ర యనియు, రాజులు రఘునాధ యనియు, సీతాదేవి నాధ యనియు, భక్తులు
సీతాపతి యనియు, సంబోధింతురు. అట్టి సీతారామునకు నమస్కారం.